దేశ చరిత్ర లో చంద్రబాబు మోసగాడుగా నిలిచిపోతారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి కొడాలి నాని. పథకాలు తీసుకున్న ప్రజలను చంద్రబాబు కుక్కలు అంటూ హేళన చేస్తారా ? అని ప్రశ్నించారు కొడాలి నాని. చంద్రబాబు కు అమరావతి రైతులు ముఖ్యమా ? ఏపీ లో ప్రజలు ముఖ్యమా . ? అని నిలదీశారు కొడాలి నాని. డ్రగ్స్ సప్లయ్ మత్స్యకారులు చేస్తున్నారని పల్లె కారులను అవమానించారని ఫైర్ అయ్యారు కొడాలి నాని.
పట్టాభి ని కాకినాడ పంపి మత్స్య కారులు  అవమానించేలా మాట్లాడిస్తావా ? అని నిప్పులు చెరిగారు.


 చంద్రబాబు పవన్ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు కొడాలి నాని. ఏపిలో ఉంది  వృద్ధ సింహం ఎన్టీయార్ కాదు యువ సింహం జగన్ అని గుర్తు పెట్టుకోవాలని.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో  కమ్మ రాజ్యాన్ని స్థాపించాలని చంద్రబాబు, పవన్ చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు  మంత్రి కొడాలి నాని. నారా చంద్రబాబు నాయుడు మానసిక స్థితిని కోల్పోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు కొడాలి నాని.  జగన్ దెబ్బ కి చంద్రబాబు చిన్నమెదడు చితికి పోయిందని ఎద్దేవా చేశారు.  బద్వేల్ ఉప ఎన్నిక అన గానే చంద్రబాబు పారిపోయాడన్నారు కొడాలి నాని,. 

టీడీ పి ని జనసేన లో  విలీనం చెయ్యండని సూచనఆలౌ చేశారు. డ్రగ్స్ తో ఏపీ కి  సంబంధం లేదని కేంద్ర సంస్థలు నిర్దారణ కు వచ్చాయని కొడాలి నాని.  చంద్రబాబు హెరిటేజ్ మార్ట్స్ ద్వారా  డ్రగ్స్ సప్లై చేసారని ఆరోపణలు చేశారు కొడాలి నాని. పవన్ కళ్యాణ్ కమ్మలకు అండగా ఉంటానని అనటం సిగ్గు లేనితనమని ఫైర్ అయ్యారు కొడాలి.  రాధాకృష్ణ, రామోజీరావు, నాయుడు చంద్రబాబుకు అండగా ఉంటాను అంటున్నాడు.. కమ్మ కులం అంటే ఈ నలుగురే అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ అని నిప్పులు చెరిగారు కొడాలి నాని.


మరింత సమాచారం తెలుసుకోండి: