ఆ యువకుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే మరో ఇద్దరితో కలిసి పెళ్లి చూపులకు వెళ్ళాడు. పెళ్లిచూపులు జరిగాయి ఇక మళ్ళీ ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో అతని ఆనందాన్ని విధి చిన్నచూపు చూసింది. చివరికి రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు అతని కబలించింది. ఈ విషాదకర ఘటన తూర్పుగోదావరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి చెందిన సూరిబాబు పెళ్లి చూపుల కోసం బంధువులతో కలిసి రాజమహేంద్రవరం వెళ్ళాడు.
అక్కడ పెళ్లిచూపులు పూర్తి చేసుకుని అదే కారులో మళ్లీ తిరుగు ప్రయాణం అయ్యారూ. కానీ వారికోసం రోడ్డు ప్రమాదం అనే మృత్యువు వేచి చూస్తుంది అన్నది మాత్రం ఊహించలేకపోయారు. ఇంటికి తిరుగు ప్రయాణం ఆయన సమయంలో అనంతపల్లి వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది కారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న గోవిందరావు కారు డ్రైవర్ శివాజీ అక్కడికక్కడే మృతి చెందారు. ఇకతీవ్ర గాయాలపాలైన సూరిబాబు ను ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులకు సహాయక చర్యలు చేపట్టారు. చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.