కొన్ని ఘటనల్లో మాత్రమే మానవ హక్కుల ఉల్లంఘనలను చూసే కొందరు వ్యక్తులు ఇతర ఘటనల్లో మాత్రం హక్కుల ఉల్లంఘన చూడడం లేదని ప్రశ్నించారు. ఇలా రాజకీయ దృష్టితో చూస్తే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని.. అలాగే ఇది ప్రజాస్వామ్యానికి హాని చేకూరుస్తుందని వ్యాఖ్యినించారు. ఒకే రకమైన సంఘటనల్లో కొన్నిటినీ ఎంచుకుని స్పందించడం సరికాదని అన్నారు. ఈ కొందరి పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలని సూచించారు ప్రధాని మోడీ.
అయితే, భారత దేశంలో నిజానికి కొన్ని సంఘటనల్లో మాత్రమే మానవహక్కుల పై మాట్లాడే వారు ఉన్నారు. కశ్మీర్ లో ఉగ్రవాదులను చంపితే వాళ్ల హక్కుల గురించి మాట్లాడే వారు బాధితుల గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం. బెంగాల్లో ఊచకోత జరిగినా ఆ వివషయంలో ఎవరూ కూడా మానవ హక్కుల గురించి మాట్లాడలేదు. దీంతో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే సంఘటనలపై మాత్రం మానవ హక్కులు గుర్తుకు వస్తాయా అన్న ప్రశ్న మోడీ వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది. ఈ సందర్భంగా మానవ హక్కుల సంరక్షణ కోసం బీజేపీ ప్రభుత్వం ఎంతగా కృషి చేస్తోందో ప్రధాని నరేంద్ర మోడీ వివరించారు. అలాగే తమ ప్రభుత్వం పేదల కోసం, మహిళల కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నామో చెప్పారు.