కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రజలకు ఉచితంగా టీకాను పంపిణీ చేస్తోంది. వ్యాక్సినేషన్ విషయంలో ఇప్పటికే రికార్డు సృష్టించి ప్రపంచ దేశాల కంటె ముంది నిలిచిన భారత్ మరో రికార్డును బ్రేక్ చేసే దిశంగా ముందుకు సాగుతుంది. నిన్నటి వరకూ సుమారు 97 కోట్లకు పైగా కొవిడ్ టీకాలను పంపిణీ చేసింది భారత ప్రభుత్వం. ఇంటింటికి వెళ్తూ కరోనా టీకాను అందిస్తోంది. టీకా విషయంలో ప్రజలకు అవగాహన కలిపిస్తోంది. అతి తొందరలో వంద కోట్ల వ్యాక్సిన్ల పంపిణీ దిశగా భారత్ దూసుకెళ్లుంది. జీ-7 దేశాలకు రెండు డోసుల వ్యాక్సిన్ ను భారత్ ఇప్పటికే పంపిణీ చేసింది.
ఒకప్పుడు వ్యాక్సినేషన్ అవుతుందా లేదా అని అయోమయంలో ఆందోళనలో ఇప్పుడు ఏకంగా 100 కోట్ల వ్యాక్సిన్ల కు చేరకుని రికార్డు సృష్టించబోతోంది. ఎలాంటి భారీ ప్రచారం లేకుండా సాఫీగా వ్యాక్సినేషన్ ప్రకియ కొనసాగడం హర్షించదగ్గ విషయం. నిన్నటి వరకు దాదాపు 96 కోట్ల 70 లక్షల వరకూ టీకాల పంపినీ చేరుకుంది. మొత్తంగా చూసుకుంటే 68.61 కోట్ల మందికి మొదటి డోస్ అందగా 27.21 కోట్ల మందికి రెండవ డోసును పంపిణీ చేసింది భారత ప్రభుత్వం.