టిఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు కె. చంద్రశేఖర రావు గారి ఆదేశాల మేరకు చేపట్టిన పార్టీ సంస్థాగత నిర్మాణం కార్యక్రమాలు పూర్తయ్యాయి అన్నారు మంత్రి కేటిఆర్. ఇందులో భాగంగా గ్రామ కమిటీలు, వార్డు, కమిటీలు, మండల కమిటీలు, పట్టణ కమిటీల నిర్మాణం సంపూర్ణంగా ముగిసింది అని ఆయన వెల్లడించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో పార్టీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియను పార్టీ చేపట్టనున్నది అని ఆయన తెలిపారు. పార్టీ అధ్యక్ష ఎన్నికను చేపట్టేందుకు అక్టోబర్ 25వ తేదీ రోజు హైదరాబాదులోని హెచ్ఐసీసీలో పార్టీ ప్రతినిధుల సభ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

గతంలో సాధారణ ఎన్నికలు, కోవిడ్ నేపథ్యంలో పార్టీ ప్రతినిధుల సభ/ప్లీనరీ జరగలేదు అని ఆయన వెల్లడించారు. పార్టీ అధ్యక్షున్ని ఎన్నుకునేందుకు 14 వేల మంది పార్టీ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు అవుతారు అని ఆయన పేర్కొన్నారు. పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ  అక్టోబర్ 17వ తేదీ నుంచి ప్రారంభం  అవుతుందని ఈనెల 17 నుంచి 22 వ తేదీ వరకు పార్టీ కేంద్ర కార్యాలయంలో నామినేషన్లను స్వీకరణ ఉంటుందని వెల్లడించారు. 23న నామినేషన్ల స్క్రూటినీ/పరిశీలన ఉంటుందని వెల్లడించారు.

24 నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని 25 పార్టీ జనరల్ బాడీ సమావేశంలో అధ్యక్షుల ఎన్నిక జరుగుతుంది అని వెల్లడించారు. పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియకు రిటర్నింగ్ ఆఫీసర్ గా పార్టీ కార్యాలయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి, ఎన్నిక ప్రక్రియ మొత్తాన్ని పార్టీ సీనియర్ నాయకులు పర్యాద కృష్ణమూర్తి, పార్టీ జనరల్ సెక్రటరీ సోమ భరత్ పర్యవేక్షిస్తారు అని ఆయన వెల్లడించారు.  25 న జనరల్ బాడీ సమావేశం లో పార్టీ అధ్యక్షుల ఎన్నిక పూర్తి అయిన తర్వాత ప్లీనరీలో  వివిధ అంశాలపైన పార్టీకి అధ్యక్షులు దిశా నిర్దేశం చేస్తారు అన్నారు. ప్లీనరీ సమావేశంలో ప్రవేశపెట్టే తీర్మానాల కమిటీ అధ్యక్షులుగా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసన సభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అక్టోబర్ 17వ తేదీన పార్టీ ఉమ్మడి శాసనసభపక్ష సమావేశంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు కెసిఆర్ గారు దిశానిర్దేశం చేశారు అని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ktr