టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా జగన్‌ సర్కార్‌ పై నిప్పులు చెరిగారు.  ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర పరిధి లోని సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ సీఎం జగన్ చంకనా కిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు దేవినేని ఉమా.  అధికారులు గుడ్డిగా జూరాల ప్రాజెక్ట్ వ్యవహారాన్ని గాలికి వదిలేసి కేఆర్ఎంబీ ఎదుట తలలూపుతుంటే, సీఎం, మంత్రులు గడ్డి పీకుతున్నారా..? శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలో చేర్చడానికి ఒప్పుకున్నవారు, జూరాలను ఎందుకు వదిలేశారు ? ఫైర్‌ అయ్యారు దేవినేని ఉమా.  

జూరాలతో పాటు నాగార్జునసాగర్ ఎడమ కాలువపై ఉన్న 17, 18 ఆఫ్ టెక్ లను కూడా సీఎం  గాలికి వదిలేశారని తీవ్రస్థాయి లో ధ్వజమెత్తారు దేవి నేని ఉమా. మే 27-2016లో చంద్రబాబు హాయాంలో కేంద్ర జల వనరుల శాఖ.. ఇరు రాష్ట్రాలతో మాట్లాడి రూపొందించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను జగన్ ప్రభుత్వం విస్మరించిందని ఫైర్ అయ్యారు.  పొరుగు రాష్ట్రం దర్జాగా 150 టీఎంసీలు తరలించుకోవడానికి ముఖ్యమంత్రే అనుమతించారా ? అని నిలదీశారు టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా.

జూరాల దిగువన పక్క రాష్ట్రం ప్రాజెక్టులు నిర్మించి నీటిని తరలి స్తుంటే , 29 నెలల నుంచి విద్యత్ ఉత్పత్తి చేస్తుంటే  ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి జగ న్ మోహన్‌ రె డ్డి ఏం చేస్తు న్నాడు ? అ ని ప్రశ్నించా రు టీడీ పీ సీని యర్ నేత దేవినేని ఉమా.  ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం జగన్ మోహన్‌ రెడ్డి గెలుపు న కు కేసీఆర్ డబ్బు సమకూర్చారని దాన్ని వదిలేశారా ? అని ఆగ్రహం వ్య క్తం చేశారు ఉమా.  తక్షణమే సీఎం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, రాష్ట్ర రైతాంగానికి న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్‌ చేశారు దేవి నేని ఉ మా.

మరింత సమాచారం తెలుసుకోండి: