తమ స్వార్థం కోసమే పార్టీలోకి వచ్చారని చులకన భావం ఏర్పడింది. గత కొద్ది రోజులుగా మీరు గమనిస్తే బీజేపీకి సంబంధించిన ఏ కార్యక్రమాలకు వీరి ముగ్గురికి ఆహ్వానాలు అందడం లేదు. పైగా ఈ విషయం తెలిసిన ఈ ముగ్గురు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఏపీ బీజేపీ కో ఇంఛార్జి గా ఉన్న సునీల్ దేవదర్ కూడా వీరిపై పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కొంత మందికి పార్కింగ్ లా మారిపోయిందని వారిని ఉద్దేశించి అనడంతో, ఆ ముగ్గురూ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఢిల్లీ పెద్దల దగ్గర ఈ ముగ్గురి పంచాయితీ ఉంది.
వారు ఏ విధంగా స్పందిస్తారు అనే దానిపై పార్టీలో వీరి భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే దేవాధర్ వ్యాఖ్యలను సమర్థించే లాగా ఉన్నారని తెలుస్తోంది. మరి ఏమి జరగనుందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.