ఇదే సమయంలో తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదానికి తెర లేచింది. ఓ వైపు తీవ్ర బొగ్గు కొరత కారణంగా దేశంలోని దాదాపు 75 శాతం ధర్మల్ విద్యుత్ కేంద్రాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పటికే బొగ్గు కొరతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ కూడా రాశారు. విద్యుత్ కోతలు తప్పవని ప్రభుత్వ అధికారులు కూడా వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి బొగ్గు కొరత లేదన్నారు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. అయితే అక్కడున్న బొగ్గు నిల్వలను మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ ఇవ్వటం లేదంటూ ఆరోపించారు మంత్రి. ప్రస్తుతం కేవలం శ్రీశైలం ప్రాజెక్టులో మాత్రం జల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోందని... మరే ఇతర ప్రాజెక్టుల్లో కూడా విద్యుత్ ఉత్పత్తి జరగటం లేదన్నారు. అయితే ఈ విషయాన్ని ఎవరూ రాజకీయం చేయవద్దని సూచించారు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం వెంటనే తగినంత బొగ్గును సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదే సమయంలో తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదానికి తెర లేచింది. ఓ వైపు తీవ్ర బొగ్గు కొరత కారణంగా దేశంలోని దాదాపు 75 శాతం ధర్మల్ విద్యుత్ కేంద్రాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పటికే బొగ్గు కొరతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ కూడా రాశారు. విద్యుత్ కోతలు తప్పవని ప్రభుత్వ అధికారులు కూడా వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి బొగ్గు కొరత లేదన్నారు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. అయితే అక్కడున్న బొగ్గు నిల్వలను మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ ఇవ్వటం లేదంటూ ఆరోపించారు మంత్రి. ప్రస్తుతం కేవలం శ్రీశైలం ప్రాజెక్టులో మాత్రం జల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోందని... మరే ఇతర ప్రాజెక్టుల్లో కూడా విద్యుత్ ఉత్పత్తి జరగటం లేదన్నారు. అయితే ఈ విషయాన్ని ఎవరూ రాజకీయం చేయవద్దని సూచించారు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం వెంటనే తగినంత బొగ్గును సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు.