ఇక ఆంధ్రప్రదేశం ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వయంగా లేఖ కూడా రాశారు. త్వరగా బొగ్గు సమస్య తీర్చాలంటూ విజ్ఞప్తి చేశారు. ఇక ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అయితే... ఒక అడుగు ముందుకు వేశారు. విద్యుత్ సంక్షోభం దృష్ట్యా ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఏసీల వినియోగం తగ్గించాలని... ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కూడా విజ్ఞప్తి చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇంత జరుగుతున్నా కూడా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి బాలనేని శ్రీనివాసరెడ్డి మాత్రం ఇప్పటి వరకు ఈ సమస్యపై కనీసం స్పందించలేదు. అసలు ఆయన ఎక్కడ ఉన్నారో కూడా తెలియటం లేదు. బొగ్గు కొరతపై తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేయడం లేదంటూ తాజాగా ఓ ట్విట్ మాత్రం... పోస్ట్ చేశారు. అంతే తప్ప... కనీసం ఆ శాఖ అధికారులతో కూడా సమీక్ష నిర్వహించినట్లు కనిపించలేదు. దీనిపై ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర విమర్శలు కూడా చేశారు. కాసేపు నీ పేకాట శిబిరాల నుంచి బయటకు రా... అంటూ టీడీపీ నేత పట్టాభి ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. అయినా సరే విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జాడ మాత్రం తెలియటం లేదు.
ఇక ఆంధ్రప్రదేశం ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వయంగా లేఖ కూడా రాశారు. త్వరగా బొగ్గు సమస్య తీర్చాలంటూ విజ్ఞప్తి చేశారు. ఇక ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అయితే... ఒక అడుగు ముందుకు వేశారు. విద్యుత్ సంక్షోభం దృష్ట్యా ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఏసీల వినియోగం తగ్గించాలని... ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కూడా విజ్ఞప్తి చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇంత జరుగుతున్నా కూడా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి బాలనేని శ్రీనివాసరెడ్డి మాత్రం ఇప్పటి వరకు ఈ సమస్యపై కనీసం స్పందించలేదు. అసలు ఆయన ఎక్కడ ఉన్నారో కూడా తెలియటం లేదు. బొగ్గు కొరతపై తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేయడం లేదంటూ తాజాగా ఓ ట్విట్ మాత్రం... పోస్ట్ చేశారు. అంతే తప్ప... కనీసం ఆ శాఖ అధికారులతో కూడా సమీక్ష నిర్వహించినట్లు కనిపించలేదు. దీనిపై ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర విమర్శలు కూడా చేశారు. కాసేపు నీ పేకాట శిబిరాల నుంచి బయటకు రా... అంటూ టీడీపీ నేత పట్టాభి ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. అయినా సరే విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జాడ మాత్రం తెలియటం లేదు.