రక్షణ శాఖ మాజీ మంత్రి, దివంగత గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ సారధ్యంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ను అమిత్ షా గుర్తు చేశారు. పారికర్ హాయంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ను ఓ కీలక అడుగుగా అభివర్ణించారు అమిత్ షా. దేశ సరిహద్దుల్లో ఎలాంటి ఆటంకాలు సృష్టించినా కూడా ఊరుకునేది లేదని హెచ్చరించారు. గతంలో చర్చలు జరిగేవని... కానీ ఇప్పుడు మాత్రం... ధీటుగా బదులిస్తున్నట్లు అమిత్ షా తెలిపారు. గతంలో జరిగిన ఉరీ, పఠాన్కోట్, గురుదాస్పూర్లలో పాకిస్తాన్ ఉగ్రమూకలు చేసిన దాడులకు భారత్ ఇప్పటికే ప్రతీకారం తీర్చుకున్నట్లు అమిత్ షా వెల్లడించారు. పాకిస్తాన్లోని ఉగ్రమూకల స్థావరాలపై ఇప్పటికే మెరుపు దాడులు చేసి ధ్వంసం చేసినట్లు షా తెలిపారు. ఇప్పటికే భారత్ చేసిన దాడుల్లో 300 మంది పైగా ఉగ్రవాదులు హతమైనట్లు తమ వద్ద నివేదిక ఉందన్నారు. ప్రస్తుతం సైన్యంలో పనిచేసే అందరికీ వన్ ర్యాంక్... వన్ పెన్షన్ విధానాన్ని మాజీ సీఎం మనోహర్ పారికర్ అమలు చేశారని షా కీలక వ్యాఖ్యలు చేశారు.
రక్షణ శాఖ మాజీ మంత్రి, దివంగత గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ సారధ్యంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ను అమిత్ షా గుర్తు చేశారు. పారికర్ హాయంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ను ఓ కీలక అడుగుగా అభివర్ణించారు అమిత్ షా. దేశ సరిహద్దుల్లో ఎలాంటి ఆటంకాలు సృష్టించినా కూడా ఊరుకునేది లేదని హెచ్చరించారు. గతంలో చర్చలు జరిగేవని... కానీ ఇప్పుడు మాత్రం... ధీటుగా బదులిస్తున్నట్లు అమిత్ షా తెలిపారు. గతంలో జరిగిన ఉరీ, పఠాన్కోట్, గురుదాస్పూర్లలో పాకిస్తాన్ ఉగ్రమూకలు చేసిన దాడులకు భారత్ ఇప్పటికే ప్రతీకారం తీర్చుకున్నట్లు అమిత్ షా వెల్లడించారు. పాకిస్తాన్లోని ఉగ్రమూకల స్థావరాలపై ఇప్పటికే మెరుపు దాడులు చేసి ధ్వంసం చేసినట్లు షా తెలిపారు. ఇప్పటికే భారత్ చేసిన దాడుల్లో 300 మంది పైగా ఉగ్రవాదులు హతమైనట్లు తమ వద్ద నివేదిక ఉందన్నారు. ప్రస్తుతం సైన్యంలో పనిచేసే అందరికీ వన్ ర్యాంక్... వన్ పెన్షన్ విధానాన్ని మాజీ సీఎం మనోహర్ పారికర్ అమలు చేశారని షా కీలక వ్యాఖ్యలు చేశారు.