సిఎం జగన్మోహన్ రెడ్డిపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేసారు నేడు. రాష్ట్రాన్ని జగన్ రెడ్డి తాకట్టుపెడుతున్నాడు అని... రాష్ట్రాన్నే కాదు భార్యను కూడా జగన్ రెడ్డి తాకట్టుపెట్టేస్తాడేమో.? అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. సీఎం సహకారంతోనే ఏపీలో మాదకద్రవ్యాల సరఫరా జరుగుతోంది అని అన్నారు. ప్రతి కాంట్రాక్టుకు ఐదు శాతం కమీషన్ ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుతోంది అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో కమీషన్లు తీసుకుంటున్నారని ఆధారాలతో నిరూపిస్తా అన్నారు ఆయన.

ఏపీలో వైసీపీ నేతల భూ కబ్జాకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది అని విమర్శించారు.  భూకబ్జాకు పాల్పడే అధికార పార్టీ నేతలకు రెవెన్యూ సిబ్బంది సహకరిస్తున్నారు అన్నారు. వైసీపీ నేతలకు సహకరించిన ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ ఖచ్చితంగా జైలుకు వెళతారు అని ఆయన వార్నింగ్ ఇచ్చారు. మోడీ చేతకానిపాలనతో దేశం మొత్తం అతలాకుతలమైంది అంటూ ఆయన వ్యాఖ్యలు చేసారు. కేంద్రమంత్రి కొడుకు ఆశిష్ మిశ్ర రైతులపై కారు ఎక్కించి చంపేశారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు.

సిసి కెమెరాల్లో కేంద్రమంత్రి కొడుకు అడ్డంగా దొరికితే ప్రధాని వెంటనే ఎందుకు స్పందించలేదు అని ఆయన ప్రశ్నించారు. సుప్రీంకోర్టు స్పందిస్తే కేసు పెట్టి అరెస్ట్ చేస్తారా..? అని నిలదీశారు. జైలులో కేంద్రమంత్రి కొడుక్కి రాజభోగాలా..? అని ఆయన నిలదీశారు. నరేంద్రమోడీ పంచభూతాలను అమ్మేస్తున్నారు అంటూ విమర్శలు చేసారు. దేశ సంపద మొత్తాన్ని ప్రైవేటు పరం చేసేస్తున్నారు అని విమర్శించారు. మాదకద్రవ్యాల సరఫరా దేశంలో విచ్చలవిడిగా జరుగుతోంది అని అన్నారు. మాదకద్రవ్యాల సరఫరాలో ఎపి ప్రభుత్వ పాత్ర ఉంది అని వ్యాఖ్యలు చేసారు.

కేంద్రం కనుసన్నల్లో జగన్ పనిచేస్తూ ఏపీ లో మాదకద్రవ్యాల సరఫరాకు సహకరిస్తున్నారు అని మోడీపై దేశద్రోహం కేసు పెట్టాలి అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. నిర్లక్ష్యం, స్వార్థం వల్ల విద్యుత్ సంక్షోభం వచ్చింది అని ఆయన విమర్శలు చేసారు. బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా సంఘాలు కలిసికట్టుగా పోరాటం చేయాలి అని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

cpi