జగన్ అంటేనే హుషార్ వస్తుంది ఆయనకి, జగన్ మీద విమర్శలు చేయాలంటే రెడీ అంటారు. ఠంచన్ గా ప్రతీ రోజూ వీడియో బైట్ ఒకటి రిలీజ్ చేయకపోతే ఆయనకు అసలు తోచదు కూడా.

ఆయనే టీడీపీకి చెందిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు. ఆయన ఈ మధ్య కాస్తా మౌనంగా ఉన్నా మళ్ళీ తన దూకుడు చూపిస్తున్నారు. రోజుకొక తీరున జగన్ మీద గట్టిగానే తగులుకుంటున్నారు. తాజాగా ఆయన జగన్ మీద చేసిన హాట్ కామెంట్స్ వైసీపీ నేతలకు మంట పుట్టించేలా ఉన్నాయి. ఏపీలో జగన్ కరెంట్ కోతలను జనాలకు రుచి చూపిస్తున్నారు అంటూ అయ్యన్న ఫైర్ అయ్యారు.

ఒక వైపు దాదాపుగా నలభై వేల కోట్ల రూపాయల పీగా విద్యుత్ చార్జీల పేరిట బాదుడు బాదిన వైసీపీ సర్కార్ ఇపుడు చీకటి రాత్రులకు కూడా చూపిస్తోంది అన్నారు. ఎన్నికలకు ముందు, పాదయాత్ర వేళ జగన్ రెండు వందల లోపు యూనిట్లు ఉన్న వారి అందరికీ ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పారని, ఇపుడు అధిక చార్జీల బాదుడే కాకుండా కరెంట్ కూడా లేకుండా చేశారని అన్నారు. జగన్ మాట తప్పేశారు, మడమ తిప్పేశారు అని కూడా ఆయన సెటైర్లు వేశారు. జగన్ ఏలుబడిలో అభివృద్ధి లేకపోగా అన్ని రంగాల్లో అంధకారం తాండవిస్తోంది అన్నారు.

ఇక ఏపీలో రెండున్నరేళ్ల పాలనను చూసిన తరువాత ఈ ఏలుబడికి స్వస్తివాచకం పలకాలని జనాలు అనుకుంటున్నారని ఊడా అయ్యన్న జోస్యం చెప్పారు. మొత్తానికి చూసుకుంటే జగన్ సర్కార్ మీద అయ్యన్న వేసినన్ని సెటైర్లు ఎవరూ వేయకపోవడం విశేషం. మరో వైపు అయ్యన్న చేస్తున్న కామెంట్స్ కి గట్టి రిటార్ట్ ఇచ్చే వారు వైసీపీలో ఎవరూ కనిపించకపోవడం విశేషం. అయ్యన్న కామెంట్స్ జనాల్లోకి పోతూంటే తిప్పికొట్టడానికి వైసీపీ నేతలు రెడీగా లేరంటే ఆశ్చర్యమే మరి. చూడాలి ఈ జోరు ఎక్కడి దాక పోతుందో.








మరింత సమాచారం తెలుసుకోండి: