దిగజారుడు ఆర్థిక వ్యవస్థపై జనసేనాని ఆందోళన వ్యక్తం చేశాడు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితిపై ఉండవల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఉండవల్లి వ్యాఖ్యలను పవన్ అస్త్రంగా మార్చుకున్నారు. ప్రభుత్వం విఫలాలను ఆయుధంగా చేసుకుని పవన్ సిద్దమవుతున్నాడనే సంకేతాలను పంపుతున్నాడు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని జనసేనాని నిర్ణయం తీసుకున్నాడని వార్తలు వెలువడ్డాయి. ఈ సమావేశంలో మేధావుల అభిప్రాయాలను తీసుకుని సుదీర్ఘ కార్యాచరణ రూపొందించి విస్థృతంగా ప్రచారం చేయాలనే భావనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టు తెలుస్తోంది.
గతంలో సీఎం జగన్, మంత్రులపై వ్యక్తిగత ఆరోపణలు గుప్పించిన పవన్ ఇప్పుడు తన రూట్ మార్చుకున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలపై పవన్ దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాను ఎండగడుతూ ప్రజలకు చేరువయ్యేందుకు పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు. అక్టోబర్ 2వ తేదిన జనసేన నిర్వహించిన శ్రమధాన కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది.