ఇప్పటికే కావాల్సినంత చెడ్డపేరు మూటగట్టుకున్న ఓటీటీలపై తాజాగా ఓ కీలక వ్యక్తి హాట్ కామెంట్స్ చేశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేశారు మోహన్ భగవత్. మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఉన్న ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన దసరా ఉత్సవాల్లో మోహన్ భగవత్ పాల్గొన్నారు. ప్రస్తుతం సమాజాన్ని డ్రగ్స్, బిట్ కాయిన్, ఓటీటీలు చెడు చేస్తున్నాయని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీకి సిద్ధాంతపరమైన మద్దతు ఇస్తోంది ఆర్ఎస్ఎస్. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ సారధ్యంలోని ఎన్డీయే సర్కార్ను ఇబ్బంది పెట్టేందుకు కొంతమంది వివిధ మార్గాల్లో ప్రయత్నం చేస్తున్నారని మోహన్ భగవత్ ఆరోపించారు. దేశంలో బిట్ కాయిన్కు ఆదరణ పెరుగుతోందని... దీని వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పే ప్రమాదం ఉందన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్. ఓటీటీ ప్లాట్ ఫామ్స్పై నియంత్రణ లేదన్నారు మోహన్ భగవత్. కేంద్రం తక్షణమే దృష్టి సారించాలని కూడా సూచించారు.
ఇప్పటికే కావాల్సినంత చెడ్డపేరు మూటగట్టుకున్న ఓటీటీలపై తాజాగా ఓ కీలక వ్యక్తి హాట్ కామెంట్స్ చేశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేశారు మోహన్ భగవత్. మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఉన్న ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన దసరా ఉత్సవాల్లో మోహన్ భగవత్ పాల్గొన్నారు. ప్రస్తుతం సమాజాన్ని డ్రగ్స్, బిట్ కాయిన్, ఓటీటీలు చెడు చేస్తున్నాయని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీకి సిద్ధాంతపరమైన మద్దతు ఇస్తోంది ఆర్ఎస్ఎస్. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ సారధ్యంలోని ఎన్డీయే సర్కార్ను ఇబ్బంది పెట్టేందుకు కొంతమంది వివిధ మార్గాల్లో ప్రయత్నం చేస్తున్నారని మోహన్ భగవత్ ఆరోపించారు. దేశంలో బిట్ కాయిన్కు ఆదరణ పెరుగుతోందని... దీని వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పే ప్రమాదం ఉందన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్. ఓటీటీ ప్లాట్ ఫామ్స్పై నియంత్రణ లేదన్నారు మోహన్ భగవత్. కేంద్రం తక్షణమే దృష్టి సారించాలని కూడా సూచించారు.