రాష్ట్ర ఖజానాకు సంబంధించిన 25 వేల కోట్ల రూపాయలకు పైగా డబ్బులకు ఎలాంటి లెక్కలు లేవని ఇప్పటికే ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా... రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇప్పటికే ఓ కన్ను వేసినట్లు వార్తలు వస్తున్నాయి. పరిస్థితి ఇంత ఇబ్బంది కరంగా ఉంటే... సంబంధిత శాఖ మంత్రి మాత్రం ప్రస్తుతం ఎక్కడా కనిపించటం లేదు. కీలకమైన ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి... దాదాపు నెల రోజులుగా కనిపించటం లేదు. కనీసం ఎక్కడ ఉన్నారో కూడా తెలియటం లేదు. బకాయిలు చెల్లించాలని, సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఆర్థిక శాఖ నుంచి ఎలాంటి బదులు లేదు. చివరికి ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు కూడా ప్రభుత్వ ప్రధాన సలహాదారు నిర్వహించారు తప్ప.... ఉద్యోగులకు ఆర్థిక శాఖ తరఫున ఎలాంటి హామీ రాలేదు. బొగ్గు కొరత కారణంగా విద్యుత్ సంక్షోభం తలెత్తింది. కావాల్సిన నిధులు కేటాయించేందుకు కూడా మంత్రి గారు కనిపించటం లేదనే అపవాదు వినిపిస్తోంది.
రాష్ట్ర ఖజానాకు సంబంధించిన 25 వేల కోట్ల రూపాయలకు పైగా డబ్బులకు ఎలాంటి లెక్కలు లేవని ఇప్పటికే ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా... రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇప్పటికే ఓ కన్ను వేసినట్లు వార్తలు వస్తున్నాయి. పరిస్థితి ఇంత ఇబ్బంది కరంగా ఉంటే... సంబంధిత శాఖ మంత్రి మాత్రం ప్రస్తుతం ఎక్కడా కనిపించటం లేదు. కీలకమైన ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి... దాదాపు నెల రోజులుగా కనిపించటం లేదు. కనీసం ఎక్కడ ఉన్నారో కూడా తెలియటం లేదు. బకాయిలు చెల్లించాలని, సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఆర్థిక శాఖ నుంచి ఎలాంటి బదులు లేదు. చివరికి ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు కూడా ప్రభుత్వ ప్రధాన సలహాదారు నిర్వహించారు తప్ప.... ఉద్యోగులకు ఆర్థిక శాఖ తరఫున ఎలాంటి హామీ రాలేదు. బొగ్గు కొరత కారణంగా విద్యుత్ సంక్షోభం తలెత్తింది. కావాల్సిన నిధులు కేటాయించేందుకు కూడా మంత్రి గారు కనిపించటం లేదనే అపవాదు వినిపిస్తోంది.