కొద్ది రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న శశికళ.. తొలిసారి బయటకు వస్తున్నారు. చెన్నైలోని మెరీనా బీచ్లో ఉన్న జయలలిత మెమోరియల్ వద్ద శశికళ నివాళులు అర్పించనున్నారు. అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపక స్వర్ణోత్సవ వేడుకలకు సరిగ్గా ఒకరోజు ముందు జయలలిత స్మారక స్థూపాన్ని శశికళ సందర్శించడం వెనుక రాజకీయ ముఖ్యమైన ఎత్తుగడ ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జయలలిత రాజకీయ వారసురాలిగా గుర్తింపు పొందిన శశికళను పార్టీ ప్రస్తుత నేతలు, మాజీ ముఖ్యమంత్రులు ఓ.పన్నీర్ సెల్వం, ఎడప్పాడి పళని స్వామిలు అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించారు. అక్రమాస్తుల కేసులో అరెస్టు అవ్వడమే ఇందుకు కారణంగా చూపారు. పార్టీతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని కూడా ప్రకటించారు. జైలు నుంచి విడుదలైన శశికళను పరామర్శించిన నేతలపై కూడా వేటు వేసింది అన్నా డీఎంకే అధినాయకత్వం. 2016 డిసెంబర్ నెలలో జయలలిత మృతి చెందిన తర్వాత మెరీనా బీచ్లోని మెమోరియల్ వద్ద శపధం చేసిన శశికళ... దాదాపు ఐదేళ్ల తర్వాత... తొలిసారి మళ్లీ సమాధి వద్దకు వస్తున్నారు.
కొద్ది రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న శశికళ.. తొలిసారి బయటకు వస్తున్నారు. చెన్నైలోని మెరీనా బీచ్లో ఉన్న జయలలిత మెమోరియల్ వద్ద శశికళ నివాళులు అర్పించనున్నారు. అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపక స్వర్ణోత్సవ వేడుకలకు సరిగ్గా ఒకరోజు ముందు జయలలిత స్మారక స్థూపాన్ని శశికళ సందర్శించడం వెనుక రాజకీయ ముఖ్యమైన ఎత్తుగడ ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జయలలిత రాజకీయ వారసురాలిగా గుర్తింపు పొందిన శశికళను పార్టీ ప్రస్తుత నేతలు, మాజీ ముఖ్యమంత్రులు ఓ.పన్నీర్ సెల్వం, ఎడప్పాడి పళని స్వామిలు అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించారు. అక్రమాస్తుల కేసులో అరెస్టు అవ్వడమే ఇందుకు కారణంగా చూపారు. పార్టీతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని కూడా ప్రకటించారు. జైలు నుంచి విడుదలైన శశికళను పరామర్శించిన నేతలపై కూడా వేటు వేసింది అన్నా డీఎంకే అధినాయకత్వం. 2016 డిసెంబర్ నెలలో జయలలిత మృతి చెందిన తర్వాత మెరీనా బీచ్లోని మెమోరియల్ వద్ద శపధం చేసిన శశికళ... దాదాపు ఐదేళ్ల తర్వాత... తొలిసారి మళ్లీ సమాధి వద్దకు వస్తున్నారు.