ఎలానో ఒకలా పరిశ్రమలను నిలుపుకునే ప్రయత్నం చేస్తున్న తమకు జగన్ నిర్ణయాలు అన్నీ ఆశనిపాతంగానే ఉన్నాయని, ఇలాంటి సర్కారు విధివిధానాలు గతంలో ఎన్నడూ లేవని, వేసవిలో కోతలు సాధారణమే కానీ వర్షాకాలంలో కూడా కోతలేంటన్నది వారి ప్రశ్న. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో కూడా అనధికార కోతలు విధిస్తుండడంతో కుటీర పరిశ్రమలపై దీని ప్రభావం పుష్కలంగా ఉంటోంది. కోతల కారణంగానే తాము కోలుకోవడం కష్టమని తేలిపోయిందని, ఇప్పటికైనా ప్రత్యామ్నాయ చర్యలు త్వరితగతిన చేపట్టాలని కోరుతున్నారు వీరంతా!
జగన్ సర్కారు పుణ్యమాని చాలా ఉత్పత్తి రంగాలకు సంక్షోభం రానుంది. చిన్నా చితకా పరిశ్రమలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా వాటిపై కూడా జగన్ సర్కారు కరుణ చూపడం లేదు. భారీ, మధ్య తరహా పరిశ్రమలకు ఎలానూ కోతలు తప్పడం లేదు. ఇవన్నీ సాయంత్రం వేళల్లో ఆరు నుంచి పది గంటల వరకూ కోతలు విధించి, సంబంధిత విద్యుత్ ను గృహావసరాలకు కేటాయిస్తూ అధికారు లు కాస్త ప్రజాగ్రహం లేకుండా చూసుకుంటున్నారు. ఇదే సమయంలో ఉత్పత్తి రంగాలకు చెందిన పెద్దల నుంచి చీవాట్లు తింటున్నా రు. శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, రణ స్థలం మండల కేంద్రంకు పారిశ్రామిక వాడగా పేరుంది. ఇక్కడ ఫార్మా కంపెనీలతో పాటు చిన్నా చితకా పరిశ్రమలూ ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 3033 వాణిజ్య పరిశ్రమలు ఉన్నాయి.