ఇక 2019 ఎన్నికలకు ముందు వరకు కూడా విజయ సాయే పార్టీలో కీలకంగా ఉండేవారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చాక విజయసాయి పాత్ర కేవలం ఉత్తరాంధ్రకు మాత్రమే పరిమితం అయ్యింది. అప్పటి వరకు ఢిల్లీ లో కీలకంగా ఉన్న విజయ సాయిని తప్పించే సి ఆ బాధ్యతలు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి అప్పగించేశారు. ఇక జగన్ ముఖ్యమంత్రి అయ్యాక విజయ సాయి ప్లేస్ ను మరో కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్రమించారు.
అయితే ఇప్పుడు సజ్జల, విజయ సాయి ఆధిపత్యానికి కూడా పూర్తిగా గండి పడనుందని అంటున్నారు. ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం తో పాటు పార్టీ కంట్రోల్ అంతా రాజకీయ సలహా దారు ప్రశాంత్ కిషో ర్ చేతుల్లో కి వెళ్లనుంది. పీకే టీం సలహాలు, సూచనల మేరకే ఇక టిక్కెట్ల కేటాయింపు అయినా.. ఇతర కీలక నిర్ణయాలు అయినా అమలు జరుగు తాయని అంటున్నారు. అప్పుడు విజయ సాయి తో పాటు అటు సజ్జల పాత్ర పూర్తి గా నామమాత్రం కానుంది. మొన్న బెంగాల్ ఎన్నికల ముందు వరకు తృణమూల్ పార్టీలోనూ అదే జరిగింది.. ఇప్పుడు కూడా అదే జరగబోతోందని అంటున్నారు.