ఏపీలో విద్యుత్ కోతలకు సంబంధించి విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఏపీ ఇంధన శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. దసరా పండుగ తర్వాత గ్రామాల్లో, మున్సిపాల్టీల్లో, నగరాల్లో లోడ్‌ రిలీఫ్‌ పేరిట గంటల కొద్దీ కరెంటు కోతలు ఉంటాయంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నాం అని పేర్కొంది. బొగ్గు నిల్వలు, సరఫరాల్లో అంతర్జాతీయంగా, దేశీయంగా ఉన్న పరిణామాలు విద్యుత్‌ ఉత్పత్తిపై పెను ప్రభావాన్ని చూపుతున్న విషయం అందిరికీ తెలిసిందే అని వెల్లడించింది.

ఇంతటి సంక్షోభ సమయంలోనూ వినియోగదారులకు నాణ్యమైన సరఫరా, కరెంటు ఇచ్చేందుకు రాష్ట్ర విద్యుత్‌పంపిణీ సంస్థలు శక్తివంచనలేకుండా కృషిచేస్తున్నాయి అని పేర్కొంది. ఎలాంటి సమస్యలు లేకుండా విద్యుత్‌ను అందిస్తున్నాయి అని వివరించింది. సంక్షోభాన్ని ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా సీఎం ఆదేశాల మేరకు అత్యవసర ప్రణాళికల అమలును వెంటనే ప్రారంభించాం అని పేర్కొంది. రాష్ట్ర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ  ఏపి  జెన్కో కు అత్యవసరంగా రూ . 250 కోట్లు నిధులు, బొగ్గు కొనుగోలు నిమిత్తం సమకూర్చ బడ్డాయి అని వివరించింది.

రాష్ట్రానికి అదనంగా రోజుకి దాదాపు 8 బొగ్గు రైళ్లు కేటాయించబడ్డాయి అని దేశంలో బొగ్గు లభ్యత ఎక్కడవున్నా కొనుగోలు చేయవలసినది గా  ఏపి  జెన్కో కు ఆదేశాలు  ఇవ్వబడ్డాయి అని వెల్లడించారు. స్వల్ప కాలిక  మార్కెట్‌ నుంచి ధర ఎంత పలికినా అవసరాల నిమిత్తం కొనుగోలు  చేయాల్సిందిగా  విద్యుత్‌ పంపిణి సంస్థలను ఆదేశించడం జరిగింది అని కేంద్ర విద్యుత్‌ సంస్థల నుంచి ఎవ్వరికి కేటాయింపబడని విద్యుత్‌ వాటా  నుంచి , వచ్చే సంవత్సరం జూన్‌ వరకు , ఆంధ్ర ప్రదేశ్‌ కోసం దాదాపు 400 మె . వాట్లు  చౌక ధర విద్యుత్‌ కోసం కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ మంత్రిత్వ శాఖకు అభర్ధన పెట్టటం జరిగింది అని పేర్కొన్నారు. బొగ్గు సరఫరా  కంపెనీలకు చెల్లించాల్సిన బకాయిలతో నిమిత్తం లేకుండా  కొరతతో వున్న విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు సరఫరా చెయ్యాలన్న కేంద్ర మార్గ దర్శకాలకు అనుగుణంగా మన రాష్ట్రానికి సరఫరా చేసే అన్ని బొగ్గు ఉత్పత్తి సంస్థలతో మాట్లాడటం జరిగింది అని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap