హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారానికి సంబంధించి మాజీ మంత్రి ఈటెల  రాజేందర్ చాలా సీరియస్ గా అడుగులు వేస్తున్నారు. ఈటెల రాజేంద్ర ప్రచారం చేసే విషయంలో దూకుడుగా ఉండటం తో అధికార పార్టీ నాయకులు కూడా బాగా కష్టపడుతున్నారు. కమలాపూర్ మండలం గుండేడులో ఈటెల రాజేందర్ ప్రచారం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు. నీ పోలీసులు, అధికారులు ఏమీ చేయలేరు అని 20ఏళ్ల బంధం నాది అంటూ ప్రతి ఇంట్లో నేనున్నా అన్నారు ఆయన. తల్లినీ, బిడ్డను వేరే చేసే ప్రయత్నాలు సాగవు అని హెచ్చరించారు.

30 తర్వాత  మీ బతుకులు ఏమవుతాయో నాకు తెలుసు అని కేసీఆర్ పాలన అంతమయితేనే ... తెలంగాణకు స్వేచ్ఛ వస్తుంది అన్నారు ఆయన. ఇక్కడ గుద్దుడు గుద్దితే.. కేసీఆర్ చెంప చెల్లుమనాలి అంటూ వార్నింగ్ ఇచ్చారు. “నీవు దేవుడివన్నారు.. గొప్పోడివన్నారు.. నీవలనే మేలు జరుగుతుందని” చెప్పిన వారు.. అంగట్లో సరుకులెక్క అమ్ముడుపోయారు అని ఆరోపణలు చేసారు. మీరంతా పదవుల కోసం పెదవులు మూసారా, అంగట్లో సరుకుల్లాగా అమ్ముడుపోయారా అంటే గయ్య్ మని లేస్తున్నారు అని ఎద్దేవా చేసారు.

నా వల్ల ఎన్నికలు రాలేదు అని కేసీఆర్, ఆయన బానిసలు నా రాజీనామాకు డిమాండ్ చేస్తే.. గడ్డిపోచలాగా పదవిని వదిలేసా అని ఆయన స్పష్టం చేసారు. పార్టీ నుంచి వాళ్లే నన్ను వెళ్లగొట్టారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. మీరిచ్చిన బీఫామ్ వల్లే గెలవలేదు అని నేను కష్టపడితేనే ఇక్కడ జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు గెలిచారు అని పేర్కొన్నారు. ఇప్పుడు పొద్దు పొడిచేదగ్గరే ఉన్నాం అని అన్న ఆయన... వాళ్ళ దర్వాజల దగ్గర, గేట్ల దగ్గర బానిసల్లాగా పడి ఉంటారు తప్ప మీకు గౌరవం దక్కదు అని పేర్కొన్నారు. మీ ఓటు మీ ఇష్టం  భార్య ఓటుమీద కూడా భర్తకు హక్కు ఉండదు అని అన్నారు. ఓటు ఎవరికి వేస్తారన్నది మీకు తప్ప ఎవరికీ తెలియదు అని మీ ఆత్మను ఆవిష్కరించేలా ఓటు వేయాలి అని ఈటెల రాజేందర్ కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts