మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా వచ్చి 11 ఏళ్లు అవుతోంది. 'ఖలేజా' తర్వాత మళ్లీ వీళ్లిద్దరూ కలిసి సినిమా చేయలేదు. అయితే ఇన్నాళ్ల తర్వాత మళ్లీ వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. త్రివిక్రమ్, మహేశ్ కలిసి చేస్తోన్న ఈ థర్డ్ వెంచర్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్గా తెరకెక్కబోతోంది. మాస్ మూవీస్తో హంగామా చేసే జూ.ఎన్టీఆర్ని సెటిల్డ్గా చూపించిన సినిమా 'జనతాగ్యారేజ్'. కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే అప్పుడు తెలుగు మార్కెట్నే ఫోకస్ చేసిన తారక్, కొరటాల ఇప్పుడు పాన్ ఇండియన్ మార్కెట్ని టార్గెట్ చేశారు. వీళ్లిద్దరి కాంబోలో మల్టీలింగ్వల్ మూవీ తెరకెక్కబోతోంది.
అల్లు అర్జున్ గ్రాఫ్ని టర్న్ చేసిన డైరెక్టర్ సుకుమార్. 'ఆర్య' సినిమాతో బన్నిని స్టైలిష్గా ప్రజెంట్ చేసిన సుక్కు ఇప్పుడు రగ్గడ్ లుక్లో చూపిస్తున్నాడు. 'పుష్ప' సినిమాతో అల్లు అర్జున్ని కంప్లీట్ రగ్గడ్ లోకి మార్చేశాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ గ్రౌండ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఎర్రచందనం కూలీగా నటిస్తున్నాడు బన్ని.ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతోన్న 'సలార్' సినిమాకి అనౌన్స్మెంట్తోనే క్రేజీ బజ్ వచ్చింది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఒక రేంజ్లో ఉంటుందనే టాక్ స్టార్ట్ అయ్యింది. అయితే ఇప్పుడు వీళ్లిద్దరి కాంబోలో మరో సినిమా వస్తుందనే ప్రచారం జరుగుతోంది. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో సినిమా వస్తుందంటే చాలు, బాలయ్య అభిమానులకి బోల్డంత ఎనర్జీ వస్తుంది. యాక్షన్ మూవీస్తో అదరగొట్టే వీళ్లిద్దరు పక్కా మాస్ మూవీతో జోష్ తీసుకొస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ అంచనాలతోనే తెరకెక్కుతోంది 'అఖండ' సినిమా.