నిన్నటి వరకు జస్ట్ ఒక ట్వీట్తో సరిపెట్టిన మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి... విపక్షాల విమర్శలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నించారు. విద్యుత్ కోతలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఖండించారు. విపక్షాలు కావాలనే తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఎదురు దాడి చేశారు. విద్యుత్ కోతలకు అసలైన కారణాన్ని మంత్రి బాలినేని స్వయంగా వెల్లడించారు. రాష్ట్రంలో కేవలం బొగ్గు కొరత వల్ల మాత్రమే విద్యుత్ సమస్య తలెత్తిందన్నారు బాలినేని. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో కూడా బొగ్గు కొరత తీవ్రంగా ఉందన్నారు. ప్రజలకు విద్యుత్ కోతలు లేకుండా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఇందుకోసం బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. విద్యుత్ సమస్య నేపథ్యంలో ప్రభుత్వంపై ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే... వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కూడా. విద్యుత్ కొరత ఉందని... అయితే కోతలు మాత్రం లేవన్నారు. తమది ప్రజా ప్రభుత్వం అన్నారు. టీడీపీ నేత లోకేష్ చేసిన విమర్శలను కూడా బాలినేని తిప్పికొట్టారు.
నిన్నటి వరకు జస్ట్ ఒక ట్వీట్తో సరిపెట్టిన మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి... విపక్షాల విమర్శలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నించారు. విద్యుత్ కోతలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఖండించారు. విపక్షాలు కావాలనే తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఎదురు దాడి చేశారు. విద్యుత్ కోతలకు అసలైన కారణాన్ని మంత్రి బాలినేని స్వయంగా వెల్లడించారు. రాష్ట్రంలో కేవలం బొగ్గు కొరత వల్ల మాత్రమే విద్యుత్ సమస్య తలెత్తిందన్నారు బాలినేని. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో కూడా బొగ్గు కొరత తీవ్రంగా ఉందన్నారు. ప్రజలకు విద్యుత్ కోతలు లేకుండా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఇందుకోసం బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. విద్యుత్ సమస్య నేపథ్యంలో ప్రభుత్వంపై ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే... వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కూడా. విద్యుత్ కొరత ఉందని... అయితే కోతలు మాత్రం లేవన్నారు. తమది ప్రజా ప్రభుత్వం అన్నారు. టీడీపీ నేత లోకేష్ చేసిన విమర్శలను కూడా బాలినేని తిప్పికొట్టారు.