మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా మీడియాలో ఎక్కువగా హైలైట్ అయ్యాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ అలాగే మంచు విష్ణు ఇద్దరూ పోటీ చేయడం తో ఎవరు గెలుస్తారు ఏంటనే దానిపై చాలా వరకూ ఉత్కంఠ కొనసాగింది. మెగా ఫ్యామిలీ ప్రకాష్ రాజ్ కు అండగా నిలబడిన నేపథ్యంలో మంచు విష్ణు ఎవరు అండగా నిలబడతారని అనుకున్న తరుణంలో నందమూరి బాలకృష్ణ మంచు విష్ణుకి పరోక్షంగా మద్దతు పలికినట్లుగా వార్తలు వచ్చాయి.

ఇది మంచు విష్ణుకి బాగా కలిసి వచ్చింది అనే కామెంట్స్ కూడా మనం చూశాం. దానికి తోడు ప్రకాష్ రాజ్ మీద నాన్ లోకల్ అనే ముద్రను బలంగా వేయడంలో సినీ పరిశ్రమ బాగా విజయవంతమైంది అనే వ్యాఖ్యలు కూడా వినిపించాయి. ఇక ప్రకాష్ రాజు విషయంలో చాలామంది ఆగ్రహంగా ఉన్నారని అది మంచు విష్ణుకి బాగా కలిసి వచ్చింది అనేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే మంచు విష్ణుకి నందమూరి బాలకృష్ణ పరోక్షంగా మద్దతు ఇవ్వడం మంచు విష్ణు విజయం సాధించడం ఆ తర్వాత బాలకృష్ణ ఇంటికి మోహన్ బాబు కి అలాగే విష్ణువు ఇద్దరూ కలిసి వెళ్లి ధన్యవాదాలు చెప్పి రావడం మీడియాలో బాగా హైలెట్ అయ్యింది.

ఇలా వెళ్ళిన తర్వాత మంచు మోహన్ బాబు నందమూరి బాలకృష్ణ ను పొగుడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. తన అల్లుడు ఓడిపోవడానికి మంగళగిరిలో ప్రచారం చేశారని అయినా సరే తన కొడుకు ని గెలిపించడానికి బాలకృష్ణ ముందుకు వచ్చారని ఇది బాలకృష్ణ సంస్కారం అంటూ ఆయన కొనియాడారు. ఈ వ్యాఖ్యలు బాగా మీడియాలో హైలెట్ అయ్యాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియా లో వినపడుతున్న మరో కామెంట్ మోహన్ బాబు నారా లోకేష్ కి ఫోన్ చేసి సారీ చెప్పారని గత ఎన్నికల్లో నారా లోకేష్ ని ఓడిపోవడానికి కొంత తాను కూడా కారణం అయ్యాను అనే భావనలో ఉన్న మోహన్ బాబు క్షమాపణ కోరారు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap