ఒక దశలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఇది అప్పట్లో పెను సంచలనం రేపింది. ఇక తనను సొంత నియోజకవర్గం వెళ్లకుండా అడ్డుకుంటున్నారంటూ రఘురామ కూడా లోక్సభ స్పీకర్కు కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఇదే సమయంలో రఘురామ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ... ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు కూడా. ఇదే పెద్ద ఎపిసోడ్గా మారింది. గతంలో రఘురామ కృష్ణంరాజుపై ముప్పేట దాడి చేసిన వైసీపీ నేతలు.. ఆయనపై అనర్హత వేటు వేయాలని కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తి రివర్స్ అయినట్లుగా ఉంది. ప్రతి రోజు సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంటకు రఘురామ కృష్ణంరాజు ప్రెస్ మీట్ పెట్టి.... వైసీపీ ప్రభుత్వంపై రఘురామ కృష్ణంరాజు విమర్శలు చేస్తూనే ఉన్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అసలు స్పందించేందుకు కూడా ఇష్టపడటం లేదు. అసలు అనర్హత వేటు పిటిషన్ పై కూడా చర్చించటం లేదు.
ఒక దశలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఇది అప్పట్లో పెను సంచలనం రేపింది. ఇక తనను సొంత నియోజకవర్గం వెళ్లకుండా అడ్డుకుంటున్నారంటూ రఘురామ కూడా లోక్సభ స్పీకర్కు కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఇదే సమయంలో రఘురామ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ... ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు కూడా. ఇదే పెద్ద ఎపిసోడ్గా మారింది. గతంలో రఘురామ కృష్ణంరాజుపై ముప్పేట దాడి చేసిన వైసీపీ నేతలు.. ఆయనపై అనర్హత వేటు వేయాలని కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తి రివర్స్ అయినట్లుగా ఉంది. ప్రతి రోజు సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంటకు రఘురామ కృష్ణంరాజు ప్రెస్ మీట్ పెట్టి.... వైసీపీ ప్రభుత్వంపై రఘురామ కృష్ణంరాజు విమర్శలు చేస్తూనే ఉన్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అసలు స్పందించేందుకు కూడా ఇష్టపడటం లేదు. అసలు అనర్హత వేటు పిటిషన్ పై కూడా చర్చించటం లేదు.