ఇదిలా ఉంటె తాజాగా పండుగ రోజున కూడా పరీక్షలు చేయించుకున్న వారు అనేక మంది ఉన్నప్పటికీ, గతంతో పోలిస్తే ఈ సంఖ్య బాగా తగ్గింది. అంటే భారత్ లో కేసులు బాగా తగ్గడమే ఇందుకు కారణం. అంటే ఈ పండుగ సీజన్ లో కేవలం 9 లక్షలు మంది మాత్రమే పరీక్షలు చేయించుకోవడం జరిగింది. అందులో దాదాపు 15వేల మందికి మాత్రమే పాజిటివ్ గా తేలింది. ముందు రోజుతో పొలిస్తేనే కేసులలో 5.7 శాతం తగ్గుదల కనిపించింది. 17వేల చిల్లర కోలుకున్నారు. 166 మంది ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది ప్రారంభం నుండి 340000000 మంది వైరస్ బారిన పడితే, 33300000 మంది కోలుకోగా, రికవరీ రేటు 98.08 శాతంగా ఉంది. మొత్తం 4లక్షల చిల్లర ఇప్పటి వరకు వైరస్ కు బలైపోయారు. సెలువు రోజు కావడంతో పరీక్షలు కూడా తగ్గాయి. అలాగే టీకాలు కూడా 8 లక్షల చిల్లర వారు టీకాలు వేయించుకున్నారు. ఇప్పటి వరకు కేంద్రం పంపిణి చేసిన టీకాల సంఖ్య 97కోట్లపైమాటే.
అయితే ఇప్పటి వరకు తగ్గుతుందని కొందరు మళ్ళీ కరోనా జాగర్తలు పాటించ కుండానే పండుగల కు ప్రయాణాలు చేశారు. ఈ నేపథ్యంలో మరో పది పదిహేను రోజులలో కేసులు పెరగక పోతే భారత్ బ్రతికినట్టే, లేదు మళ్ళీ కేసులు పెరిగితే పరిస్థితి మొదటికి వచ్చే అవకాశాలు లేకపోలేదు. అందుకే ఇంకా రెండో వేవ్ ఉంది, మూడో వేవ్ సిద్ధంగా ఉంది అని ఆరోగ్య శాఖ హెచ్చరిస్తూనే ఉంది. కానీ ఎవరు కూడా కరోనా నియమాలు పాటించడం లేదు. ముందస్తు జాగర్తలు కాపాడగలవు అనేది ప్రజలు కూడా తెలుసుకొని, మరో రెండు లేదా మూడు నెలలు కనీసంలో కనీసం కరోనా నియమాలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.