గత కొన్ని రోజులుగా దేశంలో పెట్రోల్ ధరలు వాహనదారుల నడ్డి విరుస్తున్నాయి. ఎల్పిజి సిలిండర్ ధరలు సైతం పెరుగుతూ ప్రజలపై గుదిబండలా మారాయి. ఇప్పటికే కరోనా కారణంగా ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలను చమురు, ఎల్పిజి ధరలతో కోట్లాది మంది తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక ఏడాది కాలంలో 14.2 కిలోల ఎల్పిజి సిలిండర్ ధర 604.63 నుంచి 906.38 లకు పెరిగింది. నమ్మశక్యం కాని రీతిలో ఒక్క ఏడాదిలోనే 301.75 రూపాయలు పెరిగింది. ఇదిలా ఉంటే ప్రధాని మోడీ పేద ప్రజలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ పథకం తీసుకోవస్తూ.. దీనిగురించి పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఎల్పిజి పై సబ్సిడీ ఎత్తివేత, గ్యాస్ ధరలు రికార్డు స్థాయిలో గరిష్ట పెరుగుదలతో ఎల్పిజి గ్యాస్ సిలిండర్లను పేద కుటుంబాలు ఉపయోగించుకోవడం  కష్టతరం చేసింది.

 గతేడాదిలో ఎల్పీజీ పెరుగుదల ప్రజలను మరింత ఆర్థిక కూపంలోకి దించిందనే చెప్పాలి. ఎందుకంటే కరోనా  కారణంగా లాక్ డౌన్, ఉద్యోగాలు కోల్పోవడం, ఉపాధి కరువవడం వంటి కారణాలతో లక్షలాది మంది ఆకలి అంచుకు జారుకున్నారు. ఇలాంటి పరిస్థితులు కొనసాగుతున్న వేళ పెట్రోల్ డీజిల్ ధరలు సైతం గత ఏడాదిలో వరుసగా 26,31 శాతం పెరిగాయి. కేంద్రంలో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు పెట్రోల్ డీజిల్ ధరలు వరుసగా 79, 101 శాతం పెరిగాయి. ఈ ప్రభావం ఇతర నిత్యావసరాల ధరల పై కూడా ప్రభావం చూపింది. రవాణా ఖర్చులు పెరగడంతో కూరగాయలు,ఇతర నిత్యావసర ల కోసం ప్రజలు అధిక మొత్తంలో రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితులకు దారి తీసింది. డీజిల్ ధరల పెరుగుదల రైతుల పంట ఉత్పత్తి పై ప్రభావం చూపి ఖర్చును సైతం అధికం చేస్తుంది. పెట్రోల్,డీజిల్, ఎల్పిజి ధరలు అంతర్జాతీయంగా పెరిగితే దేశీయంగా ను పెంచాల్సి ఉంటుందని దీని కారణంగానే ధరలు పెంచాల్సి వస్తుందని పదేపదే బిజెపి నాయకులు చెబుతున్నారు. వాస్తవ విషయం ఏమిటంటే అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్న తగ్గుతున్న మోడీ ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని నిర్విరామంగా పెంచుతోంది. పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం వంటి పరోక్ష పన్నుల ద్వారా మోడీ ప్రభుత్వం ప్రజలను ఎందుకు ఎక్కువగా పీడిస్తోందని తరచుగా  ఆశ్చర్యపోతున్నారు. దీనికి ప్రధాన కారణాలు మోడీ సర్కారు ధనవంతుల పై పన్నులు పెంచడానికి ఇష్టపడదు. మరిన్ని రాయితీలు ఇవ్వాలనుకుంటుంది. కాబట్టి వనరులను పెంచడానికి ఇది మొత్తం విధానాలను అమలు చేస్తోంది. వీటిలో ప్రజలపై పరోక్ష పన్నులు, వివిధ సామాజిక సంక్షేమ కార్యక్రమాల కోసం నిధులను తగ్గించడం, ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయకపోవడం, ప్రభుత్వం రంగ ఆస్తులను తక్కువ ధరకు విక్రయించడం, రోడ్లు,పోర్టులు,టెలికాం మౌలిక సదుపాయాలు, రైల్వే స్టేషన్లు, దేశంలోని మార్గాలు ఇతర కీలక భౌతిక ఆస్తులు ప్రైవేట్ పరం చేయడం వంటి చర్యలకు పాల్పడుతోంది.

ప్రజల నుంచి సేకరించిన ఈ సొమ్మును వారి కోసం వినియోగించడం లేకపోవడంతో   పాటు కార్పొరేట్ సంస్థలు తీసుకున్న బ్యాంకు రుణాలు మాఫీ చేయడం, , పన్నుల నుండి మినహాయింపులు ఇవ్వడం, కార్పొరేట్ పన్ను తగ్గించడం ధనికుల అనుకూల చర్యలతో ముందుకు సాగుతోంది. మొత్తంగా చెప్పాలంటే పెట్రోలియం ఉత్పత్తులపై అధిక పన్నులు సాధారణ ప్రజల పై సేకరించి బడాబాబులకు అనుకూలంగా పాలన సాగించడానికి మోడీ సర్కారు ప్రణాళికాబద్ధమైన మరొక వ్యూహాన్ని అమలు చేస్తోందని నిపుణులు,విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: