రాష్ట్రం మొత్తం మీద 9 జిల్లాల్లోని 12 స్థానాల్లో వివిధ కారణాలతో ఎన్నికలు జరగలేదు. ఎన్నికలు జరగని వాటిల్లో మున్సిపల్ కార్పొరేషన్ స్థానాలు ఉన్నాయి. పలు జిల్లాల్లోని 12 స్థానాలకు పొలింగ్ బ్రేక్ పడింది. ఈ మినీ ఎన్నికల సమరం ఉత్తరాంధ్ర మినహా కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఉండనుంది. నవంబర్ ఫస్ట్ వీక్ లో ఈ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుందని అంటున్నారు.
ఇదిలా ఉంటే ఇందులో మంత్రి అనిల్ కుమార్ ప్రాథినిత్యం వహిస్తోన్న నెల్లూరు కార్పొరేషన్ తో పాటు కడప జిల్లాలోని కమలాపూరం - నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం - గుంటూరు జిల్లా గురజాల, దాచేపల్లి , కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మున్సిపాల్టీలు ఉన్నాయి. వీటితో పాటు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు, కృష్ణా జిల్లా కొండపల్లి - ప్రకాశం జిల్లా దర్శి, చంద్రబాబు నియోజకవర్గం కుప్పం - కడప జిల్లా బేతం చెర్ల , రాజంపేట , అనంతపురంలోని పెనుగొండ మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఈ స్థానాల్లో కూడా పాగా వేసేందుకు వైసీపీ వాళ్లు ఇప్పటి నుంచే కసరత్తులు మొదలు పెట్టేశారు. అయితే మంత్రి అనిల్ కూడా ఇప్పుడు నెల్లూరు కార్పోరేషన్ లో వైసీపీ ని గెలిపించి తన పట్టు నిలుపుకోవాల్సి ఉంది. అయితే ఈ పరీక్షలో మంత్రి అనిల్ పెద్ద కష్టపడకుండా గట్టెక్కే ఛాన్సులే ఉన్నాయి.