ఇప్పటికే స్థానికేతరులను టార్గెట్ చేస్తున్న ఉగ్రవాదులు... అవకాశం దొరికినప్పుడల్లా కాల్పులకు తెగబడుతున్నారు. తాజాగా మరో ఇద్దరు పౌరులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. దీంతో పరిస్థితి చెయ్యి దాటిపోక ముందే పరిస్థితి చక్కబెట్టేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. శ్రీనగర్లో పరిస్థితులపై అత్యవసర నివేదిక అందించాలని ప్రత్యేక నిఘా బృందాన్ని నియమించింది కేంద్రం. 24 గంటల్లో పూర్తిస్థాయి వివరాలతో సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించింది. అసలు హత్యల వెనుక కారణం ఏమిటీ.... ఉగ్రమూకల లక్ష్యం ఏమిటీ... ఇవి తీవ్రవాదుల కుట్రా... లేక రాజకీయ పార్టీలు చేస్తున్న దాడులా అనే కోణంలో విచారిస్తోంది కేంద్ర హోం శాఖ. అసలు స్థానికేతరులను టార్గెట్ చేస్తున్న వారు ఎవరూ... వాళ్ల వెనక ఉన్నది ఎవరూ అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది కేంద్రం. కశ్మీర్లో పరిస్థితిని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
ఇప్పటికే స్థానికేతరులను టార్గెట్ చేస్తున్న ఉగ్రవాదులు... అవకాశం దొరికినప్పుడల్లా కాల్పులకు తెగబడుతున్నారు. తాజాగా మరో ఇద్దరు పౌరులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. దీంతో పరిస్థితి చెయ్యి దాటిపోక ముందే పరిస్థితి చక్కబెట్టేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. శ్రీనగర్లో పరిస్థితులపై అత్యవసర నివేదిక అందించాలని ప్రత్యేక నిఘా బృందాన్ని నియమించింది కేంద్రం. 24 గంటల్లో పూర్తిస్థాయి వివరాలతో సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించింది. అసలు హత్యల వెనుక కారణం ఏమిటీ.... ఉగ్రమూకల లక్ష్యం ఏమిటీ... ఇవి తీవ్రవాదుల కుట్రా... లేక రాజకీయ పార్టీలు చేస్తున్న దాడులా అనే కోణంలో విచారిస్తోంది కేంద్ర హోం శాఖ. అసలు స్థానికేతరులను టార్గెట్ చేస్తున్న వారు ఎవరూ... వాళ్ల వెనక ఉన్నది ఎవరూ అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది కేంద్రం. కశ్మీర్లో పరిస్థితిని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.