కరోనా తగ్గింది అనుకుంటున్నా మళ్ళీ ఎక్కడో అక్కడ ప్రభావం చూపుతూనే ఉంది. కొన్ని దేశాలు అధిగమించినట్టు అనుకుంటున్నాయి, అంతలోనే మళ్ళీ తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. ప్రతి సారి కొత్త వేరియంట్ తో కరోనా వైరస్ దాడి చేస్తుండటంతో మళ్ళీ విజృంభించే వరకు దాని ప్రభావం తెలియడం లేదు. కాస్త తగ్గుముఖం పట్టగానే ప్రజలు కూడా కరోనా నిబంధనలు ఆచరించడం ఆపేస్తుండటం మరో కారణంగా వైద్యులు చెపుతున్నారు. అందుకే ఒక ప్రాంతంలో తగ్గుముఖం పట్టినా మరో ప్రాంతంలో తీవ్రంగా ప్రభావితం చూపుతుంది అంటున్నారు. భారత్ లాంటి దేశాలలో కూడా కాస్త తగ్గినట్టే కనిపించినా, పండుగ సందర్భంగా మళ్ళీ విజృభించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

ఇక ఇప్పటికే రష్యా, జార్జియా, న్యూజిలాండ్ లలో ఈ వైరస్ తీవ్రరూపం దాల్చుతోంది. రోజు రికార్డు స్థాయిలో అక్కడ కేసులు నమోదు అవటంతో మరోసారి లాక్ డౌన్ వైపు చూస్తున్నాయి ఆయా దేశాలు. న్యూజిలాండ్ రాజధానిలో ఈ తరహా నిర్ణయాలు ఇప్పటికే అమలు అవుతున్నాయి. కేసులు పెరగటంతో లాక్ డౌన్ కూడా పొడిగించారు. ప్రారంభంలో కరోనా నుండి తప్పించుకున్నా, ఇప్పుడు డెల్టా వేరియంట్ మాత్రం ఈ దేశాన్ని కుదిపేస్తోంది. ఒకపక్క సరిహద్దులు మూయబడ్డాయి, దేశంలో లాక్ డౌన్ అమలులో ఉంది అయినా కేసులు మాత్రం తగ్గటం లేదు. అందుకే వాక్సిన్ ఒక్కటే మార్గం అని దానిని అందరికి అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆక్లాండ్ లో మొత్తం జనాభా 17 లక్షలు, అక్కడ పూర్తిగా లాక్ డౌన్ అమలులోకి తెచ్చారు అధికారులు. ఎటువంటి సమావేశాలకు అనుమతి లేదని కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారు.

జార్జియా పరిస్థితి కూడా దాదాపుగా అంటే ఉంది. ఇక్కడ ఐదో వేవ్ తీవ్రంగా ప్రభావితం చూపుతోంది. ఒకపక్క అక్కడ అంటువ్యాదులు, మరోపక్క కరోనా తీవ్రంగా వేధిస్తున్నాయి. ముందస్తు జాగర్తలపై ప్రజలకు అధికారులు అనేక సూచనలు చేస్తూనే ఉన్నారు. రోజు ఇక్కడ కూడా రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. ఐదవ వేవ్ అనుకున్న దానికంటే తీవ్రంగా ప్రభావితం చూపుతుందని అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: