ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ద‌స‌రా త‌ర్వాత ఎప్పుడు అయినా కూడా త‌న కేబినెట్‌ను ప్ర‌క్షాళ‌న చేస్తార‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే కొత్త కేబినెట్లో చోటు కోసం ఎంతో మంది ఆశావాహులు ఎవ‌రి ప్ర‌య‌త్నాలు వారు చేస్తున్నారు. ముఖ్యంగా జ‌గ‌న్ సొంత సామాజిక వ‌ర్గం అయిన రెడ్డి సామాజిక వ‌ర్గం నుంచే ఏకంగా 25 మంది వ‌ర‌కు సీనియ‌ర్ ఎమ్మెల్యేలు మంత్రి ప‌ద‌వి పై ఆశ‌ల‌తో విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ లిస్టు చూస్తే ఇక్క‌డ తూర్పు గోదావ‌రి నుంచి గుంటూరు - ప్ర‌కాశం - నెల్లూరు తో పాటు రాయ‌ల సీమ‌లోని నాలుగు జిల్లాల కు చెందిన సీనియ‌ర్ రెడ్డి ఎమ్మెల్యే లు త‌మ‌కు ఈ సారి ఖ‌చ్చితంగా మంత్రి ప‌ద‌వి కావాల్సిందే అంటూ ప‌ట్టు బ‌డుతున్నారు.

ముఖ్యంగా ప్ర‌కాశం, నెల్లూరు జిల్లాల‌కు చెందిన ముగ్గురు వైసీపీ రెడ్డి ఎమ్మెల్యే లు మంత్రి ప‌ద‌వి కోసం తాడే పేడో తేల్చుకుంటామ‌న్న‌ట్టుగా సంకేతాలు వ‌దులు తున్నారు. వారు ఎవ‌రో కాదు ప్ర‌కాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మ‌హీధ‌ర్ రెడ్డి. అటు నెల్లూరు జిల్లా నుంచి వెంక‌ట గిరి ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి తో పాటు కోవూరు ఎమ్మెల్యే ప్ర‌స‌న్న కుమార్ రెడ్డి మంత్రి ప‌ద‌వు ల‌పై ఆశ‌ల‌తో ఉన్నారు.

అయితే ఇంకా చాలా మంది రెడ్లు మంత్రి ప‌ద‌వి కావాల‌ని అడుగుతున్నా.. వీరు ముగ్గురు మాత్రం బ‌హిరంగంగానే ఏదో ఒక వ్యాఖ్య చేయ‌డంతో పాటు అటు అసంతృప్త వ్యాఖ్య‌లు చేస్తూ వ‌స్తున్నారు. ఆనం రామ నారాయ‌ణ రెడ్డి గ‌త రెండేళ్లు గా తీవ్ర‌మైన అస‌మ్మ తి నేత అన్న ముద్ర వేయించు కున్నారు. ఆయ‌న ఈ సారి ఖ‌చ్చితంగా మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌క పోతే ఎన్నిక‌ల కు ముందు టైం చూసుకుని పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేలా ఉన్నారు. అటు మ‌హీధ‌ర్ రెడ్డి సైతం మంత్రి ప‌ద‌వి రాక‌పోతే బ్లాస్ట్ అయ్యేందుకు రెడీ గానే ఉన్నారు. ఇక ప్ర‌స‌న్న మాత్రం లోలోన త‌న అసంతృప్తిని అణుచు కుంటూ వ‌స్తున్నారు. మ‌రి జ‌గ‌న్ వీరిలో ఎవ‌రి స్వీట్ .. ఎవ‌రికి హాట్ న్యూస్ చెపుతారో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: