సార్వభౌమత్వానికి చిహ్నంగా ఒకదేశ జాతీయ జండాను తగలబెట్టబోవటం చుసిన ఏదేశమైన ఖచ్చితంగా దానిని ఖండించాలి, ఎందుకంటే దానికి ఒక దేశపతాకం ఉంది, దానికో గౌరవం ఉంది, వాళ్ళ పతాకానికి గౌరవం ఉందన్నప్పుడు అదే ప్రతి జాతీయ పతాకానికి ఉంటుందన్నది కనీస సంస్కారం, అది లోపించిన ఆస్ట్రేలియాలో అధికారులు భారతీయుడిపైనే చర్యలు తీసుకున్నాయి. అక్కడ ఉన్న నియమాలు ఏమైనా కావచ్చు, ఒకరి జాతీయ జండాను గౌరవించినప్పుడు, మరొకరి జాతీయజండాకు కూడా కనీస గౌరవం ఇవ్వడం అత్యవసరం. అది ప్రపంచ దేశాలలో లోపిస్తే, అదే తీవ్రవాదులు అలుసుగా చేసుకొని ఒక్కోదేశంపై ఇంకొకళ్ళను ఉసిగొలుపుతూ వాళ్ళు చోద్యం చూస్తూ సంతోషపడతారు. ఆ అవకాశం ప్రపంచదేశాలు ఇవ్వకుండా, ఉమ్మడిగా ఉండేందుకు, ఒకరిని ఒకరు గౌరవించుకునే విధంగా ప్రవర్తించడం అవసరం. అదే లోపించినప్పుడు ఒక ఐక్యరాజ్యసమితి కావచ్చు మరొకటి కావచ్చు అంతర్జాతీయ సంస్థలు అన్ని ఉండి దండగ. అవన్నీ ఉమ్మడి ప్రయోజనాల కోసమేగా ఏర్పాటు చేసుకుంది.
భారతీయుడిని ఖైదు చేయడంపై స్పందించిన విదేశాంగమంత్రి జయశంకర్ జోక్యంతో అతడిని విడిచిపెట్టారు. అతడు ఆస్ట్రేలియా వదిలి భారత్ వస్తే అభిమానులు అతడికి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మొత్తం మీద అతడిని ప్రజలు రోడ్ షో నిర్వహిస్తూ ఇంటివరకు తీసుకెళ్లారు. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు భారత్ ను ఎంత తొక్కేయాలని ప్రయత్నించినా, ఇంకాస్త పై పైకి వెళ్తుంది తప్ప తగ్గేదేలే. నేడు సమాజంలో దేశం గురించి కాస్త మాట్లాడితే ఎక్కిరించే వాళ్ళు ఉండొచ్చు కానీ, ఇప్పుడిప్పుడే ఆ మొహమాటం నుండి భారతీయులు బయటకు వస్తున్నారు.