కర్నూలు : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి పై టీడీపీ పార్టీ  పట్టాభి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని  పేర్కొన్నారు  కర్నూల్ ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్.  మాజీ మంత్రి నక్కా'కు పోలీసులు నోటీసులిస్తే .. కుక్కలు మొరుగుతున్నాయని నిప్పులు చెరిగారు  ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్.  చంద్రబాబు డైరెక్షన్లోనే టీడీపీ పార్టీ  పెంపుడు కుక్కలు సీఎం జగన్ మోహన్ రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాయని మండిపడ్డారు.  టీడీపీ పార్టీ  నేతలు హద్దుల్లో ఉండక పోతే ప్రజలే చెప్పులతో జవాబు చెబుతారన్నారు  ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ . 

4 కోట్ల ప్రజల అభిమాన నాయకుడు, సీఎం పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకొమని హెచ్చరించారు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో  వ్యవస్థల్ని టీడీపీ పార్టీ   తప్పుపట్టడమే పనిగా పెట్టుకొందని మండిపడ్డారు.  టిడిపి పార్టీ  తన సొంత పత్రికల్లో,  తప్పుడు కథనాలతో అవే నిజమని ప్రజలను నమ్మించాలని చూస్తోందని మండిపడ్డారు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ . ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ నేతల మాటలు అస్సలు నమ్మబోరని... తెలుగుదేశం పార్టీ నేతలు చాలా దిగజారి వ్యాఖ్యలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తగిన సమయంలో ..తగిన చోట... తెలుగుదేశం పార్టీ నాయకులకు సమాధానం చెప్పి తీరుతారని హెచ్చరించారు వైసిపి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కేవలం వైసిపి పార్టీ తోనే జరుగుతుందని చెప్పారు. కాగా టిడిపి పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కొందరు దుండగులు... పట్టాభి ఇల్లు, మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయం అలాగే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ... క్యాంపు కార్యాలయంపై కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు.  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి మనందరికీ విధితమే.

మరింత సమాచారం తెలుసుకోండి: