రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నేతల్లో కొంత నైరాశ్యం నెలకొన్న మాట వాస్తవం. ఒక దశలో రాష్ట్రంలో ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలు కనీసం కనిపించలేదు. కొంతమంది ప్రభుత్వ వేధింపులకు భయపడగా... మరికొంత మంది కేసులకు భయపడి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇది కార్యకర్తలపై కూడా పెను ప్రభావం చూపింది. చాలా మంది కార్యకర్తలు కూడా.. నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ పార్టీ కార్యాలయంపై దాడి మాత్రం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం తీసుకువచ్చింది. వైసీపీ నేతల దాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు.... రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల టీడీపీ నేతల్లో ఒక్కసారిగా చలనం వచ్చింది. అధికార పార్టీ తీరును తీవ్రంగా ఖండిస్తూ... రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. పార్టీ కార్యాలయంపై దాడి.... ఒకరకంగా నేతల్లో ఉత్సాహానికి కారణమైంది.
రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నేతల్లో కొంత నైరాశ్యం నెలకొన్న మాట వాస్తవం. ఒక దశలో రాష్ట్రంలో ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలు కనీసం కనిపించలేదు. కొంతమంది ప్రభుత్వ వేధింపులకు భయపడగా... మరికొంత మంది కేసులకు భయపడి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇది కార్యకర్తలపై కూడా పెను ప్రభావం చూపింది. చాలా మంది కార్యకర్తలు కూడా.. నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ పార్టీ కార్యాలయంపై దాడి మాత్రం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం తీసుకువచ్చింది. వైసీపీ నేతల దాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు.... రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల టీడీపీ నేతల్లో ఒక్కసారిగా చలనం వచ్చింది. అధికార పార్టీ తీరును తీవ్రంగా ఖండిస్తూ... రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. పార్టీ కార్యాలయంపై దాడి.... ఒకరకంగా నేతల్లో ఉత్సాహానికి కారణమైంది.