ఈసంవత్సరం ఉగాది కి రిలీజ్ అయిన ‘వకీల్ సాబ్’ మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకోవాలని ప్రయత్నించిన దిల్ రాజ్ నిర్మించిన ‘వకీల్ సాబ్’ ఆశల పై కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు సహకరించక పోవడంతో ‘వకీల్ సాబ్’ మూవీ ద్వారా దిల్ రాజ్ తాను కోరుకున్న లాభాలను పొందలేకపోయాడు అన్నవార్తలు ఉన్నాయి.



ఇప్పుడు కరోనా భయాలు పూర్తిగా తీరిపోయి జనం స్వేచ్చగా తిరుగుతున్న పరిస్థితులు ఏర్పడి ధియేటర్లు తెరుచుకున్నప్పటికీ ఒక భారీ సినిమా ఇంకా విడుదల కాకపోవడంతో ధియేటర్లు ఇంకా కళకళలాడటం లేదు. దీనితో ఇండస్ట్రీ వర్గాలు చూపు అంతా ‘అఖండ’ మూవీ పై ఉంది. బోయపాటి బాలకృష్ణల కాంబినేషన్ కావడంతో ఈమూవీ పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి.



వాస్తవానికి ఈ సినిమాను ఎన్టీఆర్ పుట్టినరోజునాడు సమ్మర్ రేస్ లోకి దింపాలని భావించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు అడ్డు తగలడంతో ఈమూవీ ఇప్పుడు రిలీజ్ కు రెడీ అయింది. ఇప్పటికే ఈసినిమాకు ఏర్పడ్డ భారీ అంచనాలతో ఈమూవీకి జరిగిన బిజినెస్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిస్థితుల మధ్య ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ఈమూవీ రైట్స్ ను ఏకంగా 19 కోట్లకు నైజాం ప్రాంతానికి సంబంధించి కొనడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.



సినిమా ఆంధ్ర హక్కులు 35 కోట్లకు అదేవిధంగా సీడెడ్ హక్కులు 12 కోట్లకు అమ్ముడు పోయాయని వాస్తున్న వార్తలు విని ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్య పడుతూ బాలకృష్ణకు ఇంత మార్కెట్ ఉందా అని కామెంట్స్ చేస్తున్నారు. ఈసినిమా రిలీజ్ కు ముందు బాలకృష్ణ చాల యాక్టివ్ గా మారి ఆహా ఓటీటీ లో అన్ స్టాపబుల్ షోను హోస్ట్ చేస్తూ ఉండటం బాలయ్య ఇమేజ్ ను మరింత పెంచుతోంది. ఈ షోకు సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో బాలయ్య వేసిన స్టెప్స్ ను చూసి మళ్ళీ బాలయ్య మ్యానియా ప్రారంభం అవుతుందా అన్న సందేహాలు వ్యక్త పరుస్తున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: