ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు టీడీపీ కార్యాలయం మీద జరిగిన దాడి బాగా హైలెట్ అవుతుంది. టీడీపీ కేంద్ర కార్యాలయం మీద వైసీపీ కార్యకర్తలు దాడులకు దిగడం తో రాష్ట్రంలో వాతావరణం బాగా వేడిగా ఉంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసారు. ఇక ఈ దాడి విషయంలో వైసీపీ నేతలు తమది తప్పు లేదని మాట్లాడుతున్నారు. రాజమండ్రి ఎంపీ మార్గాన్ని భరత్ మాట్లాడుతూ టీడీపీ  నాయకుల మాట్లాడే తీరు సభ్యసమాజం సిగ్గు పడేలా ఉంది అని వ్యాఖ్యలు చేసారు.

ఏదో రకంగా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని టీడీపీ  నాయకులు చూస్తున్నారు అని విమర్శలు చేసారు. గతంలో టిడిపి నాయకులే హిందూ దేవాలయాలపై దాడులు చేయించారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. పట్టాభిని మురికి కాలవలో తిరిగే పంది అని మేము కూడా మాట్లాడగలం అంటూ ఆయన వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి పట్టాభికి లేదు అని అన్నారు ఆయన. నువ్వు ఎవరో కూడా అసలు జనాలకు తెలియదు అని వ్యాఖ్యానించారు. మీకు మీరే దాడి చేసుకుని మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అని విమర్శించారు.

సాక్షాత్తు పిల్లనిచ్చిన మామపైనే చంద్రబాబు  చెప్పులు విసిరించిన ఘటన రాష్ట్ర ప్రజలు ఎవరూ మర్చిపోలేదు అని వ్యాఖ్యలు చేసారు. గజరాజు వెళ్తుంటే కుక్కలు మొరగడం సహజం అనే సామెత చంద్రబాబునాయుడుకి వర్తిస్తుంది అని అన్నారు ఆయన. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు  మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి పాలన చూసి ఓర్వలేక అల్లర్లు సృష్టించేందుకు ఇలా చేస్తున్నారు అని విమర్శించారు. దౌర్జన్యాలు, మానభంగాలు టీడీపీ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య అని జగన్మోహన్ రెడ్డిని పట్టాభి వెంటనే క్షమాపణ కోరాలి అని డిమాండ్ చేసారు. పట్టాభి క్షమాపణ చెప్పని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఏం చేయాలో అది చేస్తాంఅని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap