విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ ఇన్‌చార్జ్‌, ఆ పార్టీ యువ‌నేత దేవినేని అవినాష్ పై ఆ దేవినేని కుటుంబానికే చెందిన మ‌రో యువ నేత‌, టీడీపీ నేత దేవినేని చందు మండిప‌డ్డారు. నిన్న మంగ‌ళ‌గిరి లోని టీడీపీ కార్యాల‌యంపై కొంద‌రు అల్ల‌రు మూకలు దాడి చేశారు. ఈ క్ర‌మంలోనే ఈ సంఘ‌ట‌న లో పాల్గొన్న వారిలో గుంటూరుకు చెందిన వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి అనుచ‌రుల తో పాటు దేవినేని అవినాష్ అనుచ‌రులు కూడా ఉన్నారంటూ నిన్న‌టి నుంచి ప్ర‌చారం జ‌రుగుతోంది. అలాగే జ‌గ‌న్ రూట్ కో ఆర్డినేట‌ర్ గా ఉన్న మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం కు కొండ‌ప‌ల్లికి చెందిన త‌ల‌శిల ర‌ఘురాం పాత్ర‌పై కూడా టీడీపీ వాళ్లు ప‌లు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు.

ఇక అవినాష్ గ్యాంగ్ ప్ర‌మేయంపై కూడా సందేహాలు వ‌స్తుండ‌డంతో ఆయ‌న క‌జిన్ దేవినేని చందు స్పందించారు. అవినాష్ నువ్వు దేవినేని కుటుంబం పరువు తీశావు... దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ ఈ కుటుంబం కు రాజకీయ భిక్ష పెడితే.. నువ్వు దేవాలయం లాంటి పార్టీ ఆఫీస్ పై మీ మిత్రబృందాన్ని పంపి దాడి చేయించావ‌ని విమ‌ర్శించారు. ఇక పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ నిన్ను తమ్ముడు అని సంభోదించి ఎంతో ప్రేమ‌గా చూసుకున్నార‌ని.. కానీ నువ్వు నీ స్వలాభం కోసం ఎంతమంది ప్రాణాలు తిస్తావు ? అని ప్ర‌శ్నించారు.

నీకు కావాల్సింది అధికార దాహం ఒక్కటే ..!  నీకు చంద్ర‌బాబు రాష్ట్ర తెలుగు యువత పదవి ఇచ్చారు. నీకు గుడివాడ సీట్ ఇచ్చార‌ని.. నువ్వు అది కూడా మార్చి పోయి ఈ రోజు నీ అనుచ‌రుల‌ను పంపి పార్టీ ఆఫీస్ పై దాడి చేయించావ‌ని మండి ప‌డ్డారు. అవినాష్ ఈ సంఘటన తో నీ రాజకీయ భవిష్యత్తు శున్యం గా కనిపిస్తుందని చందు జోస్యం చెప్పారు. ఇక పార్టీ ఆఫీస్ పై దాడి జ‌రిగిన‌ప్పుడు దేవినేని అవినాష్ మిత్రాబృందం అక్కడ క‌నపడ్డారు అని ప్రత్యక్ష  సాక్షులు చెపుతున్నార‌ని కూడా చందు చెప్పారు. ఏదేమైనా వివాదాల‌కు దూరంగా ఉండే అవినాష్ పేరు ఈ సంఘ‌ట‌న‌లో తెర‌మీద‌కు రావ‌డం గ‌మ‌నార్హం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: