మా ముఖ్యమంత్రిపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదు అంటూ హెచ్చరించారు జీవన్రెడ్డి. డీఎస్ తన కొడుకులకు 500 కోట్ల ఆస్తి పంచి ఇచ్చారు కానీ సంస్కారం మాత్రం నేర్పించలేదు అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బాండ్ పేపర్ రాసిచ్చి మరి రైతులను మోసం చేసిన బడా చోర్ బీజేపీ ఎంపీ అరవింద్ అంటూ వ్యాఖ్యానించారు టిఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. దమ్ముంటే వచ్చి ఆర్మూర్ లో తన మీద పోటీ చేసి గెలవాలని అంటూ సవాల్ విసిరారు. ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తామని ధర్మపురి అరవింద్ హామీ ఇచ్చారని.. కానీ ఇప్పటివరకు పసుపు బోర్డు తీసుకురాలేదని.. ఆ ఊసే మర్చిపోయారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే గతంలో పసుపు బోర్డు తెస్తాను అంటూ అరవింద్ హామీ ఇచ్చిన వీడియోలను కూడా విడుదల చేశారు జీవన్రెడ్డి.
మా ముఖ్యమంత్రి, మీద కేటీఆర్ మీద తప్పుడు మాటలు మాట్లాడితే అందరి పై పరువు నష్టం దావా వేస్తానంటూ హెచ్చరించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ దళిత బంధు ఆపితే అదేదో మేమే చేసినట్లుగా మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. ఎమ్మెల్సీ కవిత మీద కామెంట్ చేస్తే నిజాంబాద్ మహిళలు అందరూ కూడా చెప్పులు చీపుర్లతో కొడతారు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి మా నేతలతో అసలు పోలికే లేదని.. మాది కమిట్మెంట్ అయితే రేవంత్ రెడ్డి ది బ్లాక్ మెయిల్ అంటూ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ఒక స్టంట్ మాస్టర్ అంటూ విమర్శలు గుప్పించారు టిఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి.