అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలనాత్మక  కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్‌  నీతిలేదు.. జాతిలేదని... ఓట్లు, సీట్లు, డబ్బు తప్ప వీళ్లకు మరో ముఖ్యమైన పనిలేదని నిప్పులు చెరిగారు ఈటల. 18న్నర ఏళ్లపాటు అడుగులో అడుగేసి నడిస్తే.. నన్ను మధ్యలో వచ్చారంటున్నారని... నేనేమైనా సబితా ఇంద్రారెడ్డిలాగా, ఎర్రబెల్లిలాగా మధ్యలో వచ్చానా? అని నిలదీశారు ఈట రాజేందర్‌.  నాకు ఏ బాధ్యత ఇచ్చినా సమర్ధవంతంగా నిర్వహించానని... ఒక్కసారి సద్దితింటేనే తల్చుకుంటారు అలాంటిది...వేలసార్లు కేసీఆర్ తో అన్నంతిన్నాను. మాట్లాడానని చెప్పారు ఈటల రాజేందర్‌.   

ఉద్యమ సమయంలో మనల్ని నమ్ముకున్నాడు.. ఇప్పుడు వదిలేసాడని.. నేను మీకు చేసిన మేలును మరిచిపోయి తాత్కాలిక ప్రయోజనాల కోసం నన్ను ఓడించే ప్రయత్నం చేస్తారా? అని ప్రశ్నించారు ఈటల రాజేందర్.  హుజురానగర్, నాగార్జున సాగర్ లాంటి చోట్ల మీరు మోసం చేయవచ్చు... కానీ హుజురాబాద్ లో మీకు సాధ్యం కాదని... ప్రేమకు లొంగే ఈ ప్రజలు.. అవసరమైతే బరిగీసి కొట్లాడుతారని మండిపడ్డారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. వాళ్ల గ్రాఫ్ పెరగడం లేదని.. బ్రహ్మాస్త్రం లాగా ఓటుకు 20 వేలు ఇస్తారట... దళితుల మీద ప్రేమతో దళితబంధు పెట్టలేదు.

 ఈ విషయం నిద్రపోయే ముందు ఆలోచించండని కోరారు ఈటల రాజేందర్‌.  నిజమైన ప్రేమ కేసీఆర్ కు ఉంటే... తొలిముఖ్యమంత్రిని చేస్తానన్న మాట నిలబెట్టుకోలేదని... కాపలా కుక్కలాగా ఉంటాన ని చెప్పి.. మన ల్ని కాపాల కుక్కల్లాగా మార్చాడని ఫైర్‌ అయ్యారు ఈటల రాజేందర్‌.  ఆయన ఇంట్లో ఐదుగురికి పదవులిచ్చుకుని మనల్ని బానిసలుగా కల్వకుం ట్ల కుటుంబం మార్చిందని... ఇవాళ పదేసి లక్షలు ఇస్తున్నాడు..కానీ కేవలం హుజురాబాద్ కే ఎందుకిస్తున్నాడో ఆలోచించండి పేర్కొన్నారు ఈటల రాజేం దర్‌. ప్రజలు టీఆర్ఎస్ పార్టీ కి మరియు సీఎం కేసీఆర్ కు బుద్ది  చెప్పే సమయం దగ్గర పడిందన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: