జగన్ ఓ సైకో శాడిస్ట్ అని అనుకున్నాం.. నిన్నటితో నిర్ధారణ అయింది అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యలు చేసారు. సైకో రెడ్డికి భాస్కర్ అవార్డ్ ఇవ్వవచ్చు అని ఆయన ఎద్దేవా చేసారు. చంద్రబాబు ఇంటి మీద వైసీపీ వాళ్ళు దాడులు చేస్తే తేలికైన సెక్షన్ లు పెట్టి వదిలేసారు అని ఆయన మండిపడ్డారు. మా పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగి రోజు గడుస్తున్నా సరే ఇప్పటి వరకు ఎవరిని అదుపులోకి తీసుకోలేదని అన్నారు. ఏపీ నుంచి గంజాయి వస్తుందని హైదరాబాద్ సీపీ చెప్పారని అన్నారు.

దాడి జరిగిన తర్వాత వాహనాలు డీజీపీ ఆఫీస్ మీదుగా వెళ్లాయని అన్నారు. ఇంటిలో ఉన్న కుక్కలను పంపి.. తాడేపల్లి ప్యాలెస్సులో దాక్కున్నారు అని ఆయన ఆరోపించారు. దాడులు చేస్తే భయపడతామని అనుకోవడం తప్పు అని అన్నారు లోకేష్. ప్రభుత్వం చేసే తప్పును నిలదీయాలని.. అవసరమైతే పోరాడాలని ప్రజలు మాకు ప్రతిపక్షంగా అవకాశం ఇచ్చారు అని ఆయన వ్యాఖ్యానించారు. మా ప్రశ్నలకు సమాధానం చెప్పొచ్చు.. లేదా మూసుకుని కూర్చొవాలి అంటూ ఎద్దేవా చేసారు.

ఏపీలో జగన్  సీఎం అయ్యాక.. గంజాయి రవాణ అనేది లీగలైజ్డ్ బిజినెస్సుగా మార్చారు అని లోకేష్ పేర్కొన్నారు. తెలంగాణ పోలీసులే ఏపీలో గంజాయి పండిస్తున్నారని చెబుతున్నారు అన్నారు లోకేష్. తెలంగాణ పోలీసులే ఏపీలో స్టింగ్ ఆపరేషన్ చేయడమే దీనికి నిదర్శనం అని ఆయన తెలిపారు. బోర్డర్ నియోజకవర్గంలో ఓ ఎమ్మెల్యే తనయుడు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు అని డ్రగ్స్ ఫ్రీ స్టేటుగా చేసేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు అని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో మీ వీపులు పగులుతాయి అన్నారు ఆయన. దాడి జరిగే 15 నిమిషాల ముందుగా సమాచారం ఇస్తే.. కనీసం పట్టించుకోలేదు అని పోరాడాలని వైసీపీ నేతలకు ఆనందంగా ఉంటే టైమ్ ప్లేస్ చెప్పండి మేమే వస్తాం అని వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: