అయితే ఆశ్చర్యకరమైన ఎన్నో నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటూ ఉండడం పట్ల వైసీపీ కి అభిమానులైన వారు కూడా ప్రశ్నించే స్థాయికి చేరుకున్నారు. కానీ ఇక్కడ ప్రజలకు సైతం అర్ధం కాని విషయం ఒకటుంది. జగన్ ఇలా చేస్తున్నాడా ? లేదా జగన్ కు ఇలాగే చెయ్యాలి... ఇది మాత్రమే చెయ్యాలి అని ఎవరైనా సలహాలు ఇస్తున్నారా ? అంటే అవును ఇది నిజం. ఏ ప్రభుత్వానికి అయినా సలహాదారులు ఉండడం సహజం. అయితే ఈ సలహాదారుల మూలంగానే పార్టీ పరువు బజారున పడుతోంది అన్న సందేహాలు ప్రజల్లోనూ మరియు పార్టీ వర్గాల్లోనూ ఉన్నాయి.
ఇపుడు ఆ సందేహం నిన్న జరిగిన దాడులతో మరింత బలపడుతోంది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆఫీసులపైన దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో వైసీపీ ప్రజల్లో ఇంకా దిగజారిపోతోంది. ఈ ఘటనలు జగన్ కు తెలిసే జరుగుతున్నాయా? లేదా దీని వెనుక ఉన్నది ఎవరు అన్న వివరాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.