పోలీసు అమరవీరుల దినం కార్యక్రమం లో పాల్గొన్న సిఎం జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ మధ్యకాలంలో మన రాష్ట్రం లో కొత్త కోణం చూస్తున్నాం అంటూ జగన్ వ్యాఖ్యలు చేసారు. కొత్త నేరగాళ్లు ఎలా చేస్తున్నారో మన కళ్ల ముందే కనిపిస్తుంది అని అన్న ఆయన... అధికారం దక్కలేదని చీకట్లో విగ్రహాలు ధ్వంసం, కుల, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు అంటూ విమర్శలు చేసారు. సంక్షేమ పధకాలను అడ్డుకునేందుకు కోర్టు లలో కేసులు వేశారు అని విమర్శించారు. ఇళ్ల నిర్మాణం కుడా ఆపి వేయించారు... పేదలకు ఇంగ్లీషు మీడియం దక్కకుండా చేశారు అని అన్నారు.
 
అబద్దాలనే డిబేట్లుగా ప్రచారం చేయడం పచ్చ చానళ్లు, పచ్చ పత్రిలను చూస్తాం అంటూ విమర్శించారు. చివరకి సిఎం నే బోష్ డికే  (లం.. కొ)అనే స్థాయికి దిగజారారు అని ఆయన ఆరోపించారు. నేడు ఇలాంటి వారిని ఎదుర్కొని ప్రజల కోసం మంచి పాలన అందిస్తున్నా అని అన్నారు జగన్. స్థానిక సంస్థల ఎన్నికలలో, ఉప ఎన్నికలలో అధికార పార్టీ కి అఖండ విజయం అందించారు అని ఆయన కొనియాడారు. ఇక అధికారం రాదనే దుగ్ధతో ఏపీ పై విషం చిమ్ముతున్నారు అని విమర్శలు చేసారు. రాష్ట్రం లో డ్రగ్స్, గంజాయి సరఫరా అంటూ పదే పదే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అన్నారు ఆయన.

 
మీరు చేసేది  సిఎం మీదే కాదు.. ఏపీ ప్రజల పై చేస్తున్న దాడి అని మండిపడ్డారు. ఇది అధర్మం, అనైతికం, పచ్చి అబద్దం అని ఆవేదన వ్యక్తం చేసారు. కేంద్రం దర్యాప్తు బృందాలు, విజయవాడ సిపి, డిజిపి ఇది అబద్ధం అని ఆదారాలతో చూపించారు అని అయినా క్రిమినల్ మైండ్ తో రాష్ట్ర యువత పై కళంకిత ముద్ర వేస్తున్నారు అంటూ విమర్శించారు. లా అండ్ ఆర్డర్ అనేది ప్రధాన ప్రయారిటీ... తన, మన బేధం వద్దు అని స్పష్టం చేసారు. పౌరుల రక్షణ, భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడవద్దు అని పోలీసులకు స్పష్టం చేసారు. బడుగు, బలహీన వర్గాల పై దాడి చేస్తే చట్టం ముందు నిలబెట్టాలి అని ఆయన ఆదేశించారు. సంఘ విద్రోహ శక్తులు, అసాంఘిక కార్యకలాపాల పై పోలీసులు ఉక్కు పాదం మోపండి అని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: