ఇటీవలే టిడిపి పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి సంచలనంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఒక్కసారిగా ఏపీ రాజకీయాలలో నిప్పు రాజేసింది. అయితే టిడిపి పార్టీ కార్యాలయంపై దాడికి నిరసనగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దీక్షకు దిగిన విషయం తెలిసిందే. పార్టీ కార్యాలయంలో 36 గంటల పాటు దీక్ష కొనసాగించనున్నారు. కాగా ఈ దీక్షకు భారీగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ సభ్యులు అందరూ హాజరు అవుతున్నారు. అయితే చంద్రబాబు చేస్తున్న దీక్ష వైసీపీ నేతలు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు  విమర్శలతో  విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల చంద్రబాబు చేస్తున్న దీక్ష పై మంత్రి బాలినేని షాకింగ్ కామెంట్స్ చేశారు



 చంద్రబాబు చేసేవన్నీ దొంగ దీక్షలు అంటూ విమర్శలు గుప్పించారు మంత్రి బాలినేని. 36 గంటలు దీక్ష చేస్తున్న అంటూ చెబుతున్న చంద్రబాబు కనీసం 12 గంటలు కూడా సరిగ్గా చేయలేడు అంటూ వ్యాఖ్యానించారు. మధ్యలో బాత్ రూమ్ కి వెళ్ళి తినేసి వస్తాడు అంటూ సెటైర్లు వేశారు. గతంలో దీక్షలు చేసిన సమయంలో కూడా చంద్రబాబుకు షుగర్ లెవెల్స్ పెరిగాయి. ఇలా దొంగ దీక్షలతో ప్రజలను మోసం చేయడం తప్ప చంద్రబాబు ఏమీ చేయలేరు అంటూ విమర్శించారు. ఎంత ప్రయత్నించినా మళ్లీ అధికారంలోకి తిరిగి రాలేము అని తెలిసే ఇలా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు అంటూ మంత్రి బాలినేని కామెంట్ చేశారు.



 మీరు ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోయే వారు ఎవరూ లేదు అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబును బోసిడికే అంటే టిడిపి నేతలు ఊరుకుంటారా అంటూ ప్రశ్నించారు మంత్రి బాలినేని. బోసిడికే అంటే అర్థం తెలుసా అంటూ ప్రశ్నించారు. గోరమైన మాటలు మాట్లాడటం దారుణం అంటూ విమర్శలు గుప్పించారు. ఉదయం చంద్రబాబు ఇంట్లో ఉన్న పట్టాభి సాయంత్రం వచ్చి ప్రెస్ మీట్ లో మాట్లాడాడు. ఒక సీఎం ను ఏ మాట పడితే ఆ మాట మాట్లాడితే అభిమానులు ఊరుకోరు.. దేశంలో ఆయన ఒక్కడే మొగాడ ఇంకెవరూ లేరా అంటూ ప్రశ్నించారు మంత్రి బాలినేని. పోసాని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఆయన పై ఎందుకు అభిమానులు దాడి చేశారు. గతంలో జగన్ ఎప్పుడూ బూతులు మాట్లాడలేదు. గతంలో ఒంగోలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు అడుగుపెట్టని పరిస్థితిని సృష్టించినప్పటికీ జగన్ బూతులు మాట్లాడటం లేదు అంటూ మంత్రి బాలినేని వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: