తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ చేస్తున్న రాజకీయ ఎత్తుగడలు చూస్తున్న రాజకీయ విశ్లేషకులు సైతం ముక్కున వేలు ఏసుకుంటున్నారు. దాదాపు నెలన్నర కాలంగా వైసీపీలో కొంతమంది సైలెంట్గా ఉన్నారు. ఇందుకు ప్రధాన కారణం... మంత్రివర్గంలో మార్పులు తప్పవనే సూచనలు. తమను తొలగిస్తారని ప్రస్తుత మంత్రుల్లో అసహనం ఉంది. అలాగే మంత్రివర్గంలో తనకు అవకాశం వస్తుందా అని సీనియర్లు, ఆశావహులు ఎదురు చూస్తున్నారు. దీంతో... తెలుగుదేశం పార్టీ నిన్న మొన్నటి వరకు చేసిన వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోలేదు వైసీపీ నేతలు. అయితే తాజాగా పట్టాభి ఘాటుగా వ్యాఖ్యానించడంతో... ఏకంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపైనే దాడి చేశారు. అంతటితో ఊరుకోకుండా... జనాగ్రహ దీక్ష పేరుతో చంద్రబాబు నిరసనకు కౌంటర్ గా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టారు కూడా. ఇందుకు ప్రధాన కారణంగా వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి అందినే ఆదేశాలే అని తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీని గట్టి దెబ్బ కొట్టేందుకు వైసీపీ మెగా ప్లాన్ వేస్తోంది.
తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ చేస్తున్న రాజకీయ ఎత్తుగడలు చూస్తున్న రాజకీయ విశ్లేషకులు సైతం ముక్కున వేలు ఏసుకుంటున్నారు. దాదాపు నెలన్నర కాలంగా వైసీపీలో కొంతమంది సైలెంట్గా ఉన్నారు. ఇందుకు ప్రధాన కారణం... మంత్రివర్గంలో మార్పులు తప్పవనే సూచనలు. తమను తొలగిస్తారని ప్రస్తుత మంత్రుల్లో అసహనం ఉంది. అలాగే మంత్రివర్గంలో తనకు అవకాశం వస్తుందా అని సీనియర్లు, ఆశావహులు ఎదురు చూస్తున్నారు. దీంతో... తెలుగుదేశం పార్టీ నిన్న మొన్నటి వరకు చేసిన వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోలేదు వైసీపీ నేతలు. అయితే తాజాగా పట్టాభి ఘాటుగా వ్యాఖ్యానించడంతో... ఏకంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపైనే దాడి చేశారు. అంతటితో ఊరుకోకుండా... జనాగ్రహ దీక్ష పేరుతో చంద్రబాబు నిరసనకు కౌంటర్ గా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టారు కూడా. ఇందుకు ప్రధాన కారణంగా వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి అందినే ఆదేశాలే అని తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీని గట్టి దెబ్బ కొట్టేందుకు వైసీపీ మెగా ప్లాన్ వేస్తోంది.