రబ్బర్ చెప్పులు...జీన్స్ ప్యాంట్ గాళ్లు ఏం చేస్తరని అన్న వాళ్ల బాక్సులు బద్దలు చేసిన చరిత్ర ఇక్కడి యువతది అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. 30న జరిగే పోలింగ్ నాడు పువ్వు గుర్తుపై ఓటేసి బీజేపీకి గెలిపించాలి అని కోరారు. దీపావళి హుజూరాబాద్ ప్రజలకు రెండ్రోజుల ముందే వస్తోంది అని వచ్చేనెల 2న వెల్లడయ్యే ఫలితాలతో ముందే పండుగ చేసుకోబోతున్నరు అని ఆయన వ్యాఖ్యాన్నించారు. టీఆర్ఎసోళ్లు ఒక్కో ఓటుకు రూ.20 వేలు ఇస్తున్నరు అన్ని ఆయన వ్యాఖ్యలు చేసారు.

తప్పకుండా తీసుకోండి అని ఆ పైసలు మనవే అంటూ ఆయన వ్యాఖ్యలు చేసారు. రేషన్ బియ్యంలో డబ్బులు కేంద్రానివే అని కిలో బియ్యానికి రూ.29లు మోదీగారే ఇస్తున్నరు అని వ్యాఖ్యలు చేసారు. కానీ రేషన్ షాపుల వద్ద కేసీఆర్ ఫొటోలు పెట్టుకోవడం సిగ్గుచేటు అని ఆరోపించారు. టాయిలెట్ నిర్మాణాలకు డబ్బులు కేంద్రమే ఇస్తున్నా...చివరకు టాయిలెట్ల వద్ద కూడా కేసీఆర్ ఫోటోలు పెట్టుకుంటున్నరు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. కేసీఆర్ ఫొటోలు చూడనిదే టాయిలెట్ రాని పరిస్థితి నెలకొంది అన్నారు.

పైసలిచ్చేది కేంద్రం....ఫొటోలు పెట్టుకుంటూ ఊరేగది మాత్రం కేసీఆర్ అని ఆయన ఎద్దేవా చేసారు. హైదరాబాద్ లో వరదలొస్తే....వరద సాయం ఆపి నా సంతకం ఫోర్జరీ చేసి బండి సంజయ్ వల్లే వరద సాయం ఆగిందని ప్రచారం చేసిండ్రు అని అన్నారు. నేను ఆనాడు కేసీఆర్ కు సవాల్ చేసిన భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద ప్రమాణం చేద్దాం రా...అని సవాల్  చేస్తే తోక  ముడిచిండు అన్నారు ఆయన. జనం టీఆర్ఎస్ ను ఓడించి బీజేపీకి సీట్లు కట్టబెట్టిండ్రు అని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు మళ్లా బీజేపోళ్లు దళిత బంధు ఆపారని కేసీఆర్ ఫ్రచారం చేస్తుండు అని విమర్శించారు. యాదాద్రికి వచ్చి ప్రమాణం చేద్దాం రా...అంటే ఇప్పటి వరకు నోరు మెదపడం లేదు అన్నారు. పేదోళ్లు...ఎన్నటికీ పేదోళ్లుగానే మిగిలిపోతున్నరు అని ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts