భారత్ చైనా సరిహద్దుల్లో రోజురోజుకీ వాతావరణం హాట్ హాట్ గా మారిపోతుంది.  గడ్డ కట్టించే చలిలో కూడా వేడి రాజుకుంటోంది.  ఏ క్షణంలో ఏం జరుగుతుందో కూడా అర్థం కాని విధంగా మారిపోయింది పరిస్థితి .  ఇక ప్రపంచ దేశాల చూపు మొత్తం భారత్ చైనా సరిహద్దుల్లో చోటుచేసుకుంటున్న పరిణామాల పైనే ఉంది.  అటు చైనా వ్యవహరిస్తున్న తీరు యుద్ధానికి దారితీసే లాగే కనిపిస్తుంది.  దీంతో అటు భారత్ కూడా సరిహద్దుల్లో భారీ రేంజ్ లోనే సైనికులు హరిస్తూ యుద్ధానికి సిద్ధం అన్న సంకేతాలు కూడా ఇస్తోంది.  భారత్ చైనా సరిహద్దుల్లో నిషేధిత భూభాగంలోకి వచ్చి గుడారాలు ఏర్పాటు చేసుకొని వివాదానికి తెరలేపింది చైనా.



 దీంతో సరిహద్దుల్లో వివాదం ఏర్పడింది. ఇక ఈ వివాదం ఏర్పడి నెలలు గడుస్తున్నాయి. ఇప్పటివరకు ఎన్నో సార్లు ఇరు దేశాలకు చెందిన ఆర్మీ అధికారుల మధ్య చర్చలు జరిగాయి. పలుమార్లు ఒప్పందాలు కుదిరాయి.  తాము వెనక్కి తగ్గుతామని నిషేధిత భూభాగాన్ని వదిలేస్తాము అంటూ చెప్పిన చైనా.. కుక్క తోక వంకర అనే విధంగా వ్యవహరిస్తోంది.  ఏదో ఒక విధంగా భారత్ ను రెచ్చగొట్టే విధంగా చర్యలు చేపడుతుంది. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో సరిహద్దుల్లో భారీగా సైనికులు మోహరించడం ఇక కొన్ని ప్రాంతాలలో యుద్ధ విమానాలను కూడా సిద్ధం గా ఉంచడం హాట్ టాపిక్ గా మారిపోయింది. దీంతో అటు భారత సైన్యం కూడా అన్నింటికీ సిద్ధమవుతోంది.



 ఎలాంటి పరిస్థితులు ఎదురైనా చైనా కు దీటుగా బదులు ఇవ్వాలి అని భారత్ కూడా ఇక అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటోంది. దీంతో మళ్లీ  సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇక ఇటీవల కాలంలో బార్డర్ ఏరియాలో భారత్ పెద్ద ఎత్తున సైనిక బలగాలను మొహరిస్తు వస్తుంది. ఇప్పటికే ఎల్ఏసి వద్దకు యుద్ధవిమానాలు, అత్యాధునిక ఆయుధాలు, బోఫోర్స్, తుపాకులు, ఎయిర్ డిఫెన్స్ గన్స్ ను కూడా తరలించింది భారత ఆర్మీ. అంతేకాదు ఆ ప్రాంతానికి ఎంతో సులభంగా చేరుకోవడానికి రోడ్లు, బ్రిడ్జీలు, సొరంగాలను కూడా అభివృద్ధి చేస్తూ వస్తోంది.  ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దుల్లో రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది అనేది హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: