ఇక్కడ ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే కొందరు రాజకీయ విశ్లేషకులు ఊహిస్తున్న ప్రకారం ప్రజలు, టీడీపీ కార్యదర్శి పట్టాభి ప్రభుత్వంపై మరియు జగన్ పై చేసిన వ్యాఖ్యల పట్ల అంత సీరియస్ గా తీసుకున్నారా అంటే నమ్మశక్యంగా లేదని అంటున్నారు. ఎందుకంటే ఇలా జరగడం ఇదేమీ మొదటి సారి కాదు. అందుకే ప్రజలు ఈ వ్యాఖ్యలను లైట్ తీసుకున్నారు అని క్లియర్ గా అర్థమవుతోంది. ఇక ఆ తర్వాత టీడీపీ ఆఫీసులపైన దాడులు జరిగినప్పుడు టీడీపీకి మద్దతుగా ప్రజలు రెస్పాండ్ అయినట్లు కూడా తెలియలేదు. దీనిని బట్టి వైసీపీ టీడీపీ అని లేకుండా ఒక రాజకీయ పార్టీలుగా మాత్రమే ప్రజలు చూస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే సరిగ్గా ప్రజలు ఏ విషయాలను కనెక్ట్ అవుతారు అనే విషయంపై ప్రతిపక్షానికి క్లారిటీ ఉన్నట్లు లేదు. ఏపీలో చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రజలకు ఉపయోగపడేవి, వాటిని వదిలేసి ఆల్రెడీ క్రియేట్ అయిన సమస్యకు ప్రజల పేరు చెప్పి గేమ్ ఆడడం ప్రజలు ఊహించలేదు. ఫైనల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ పార్టీలకు కావాల్సింది ప్రజల సమస్యలు కాదు. వాటి వారి స్వార్ధపరమైన పదవులు అధికారాలు మాత్రమే. రాష్ట్రం ఏమైనా పర్వాలేదు వీరి అవేశం, పగలు, ప్రతీకారాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు.