రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వైసీపీ నాయకులు అప్రమత్తం అయ్యారు. తమ నాయకుడ్ని టీడీపీ నాయకులు తిట్టిపోయడంపై మండి పడుతూ జిల్లా కేంద్రాలలో జనాగ్రహ దీక్షలు చేస్తున్నారు. ఈ సందర్భంగా జగన్ పై స్వామి భక్తిని నిరూపిం చుకునేందు అదుపు తప్పి మాట్లాడుతున్నారు. నిన్నటి వేళ రోజా మళ్లీ తన నోటికి పని చెప్పారు. తనదైన శైలిలో చంద్రబాబును, ఆయన కొడుకును తిట్టిపోశారు. ఇలా తిట్టుకుంటూ పోతే వీటికి అడ్డూ అదుపూ లేకుండా పోతే ఈ రాష్ట్రం ఏమైపోతుందని? తమ అధినేత దగ్గర మార్కులు కొట్టేయాలన్న ఆలోచనతో కొందరు మరీ ఎక్కువగా చంద్రబాబును టార్గెట్ చేసుకుని పాత గొడవలన్నీ తవ్వి తీసి మాట్లాడడంతో తీవ్ర పరిణామాలు అన్నవి మున్ముందు చోటు చేసుకోక తప్పవు. ఇప్పటికే తాము ఎవ్వరినీ వదలమని లోకేశ్ చెబుతున్నారు. అన్నింటినీ గుర్తు పెట్టుకుంటామని రేపటి వేళ తాము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా అన్నింటికీ బదులు ఇస్తామని ప్రతికారేచ్ఛ అన్నది తప్పదని కూడా స్పష్టం చేస్తున్నారు వైసీపీ నాయకులు.
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వైసీపీ నాయకులు అప్రమత్తం అయ్యారు. తమ నాయకుడ్ని టీడీపీ నాయకులు తిట్టిపోయడంపై మండి పడుతూ జిల్లా కేంద్రాలలో జనాగ్రహ దీక్షలు చేస్తున్నారు. ఈ సందర్భంగా జగన్ పై స్వామి భక్తిని నిరూపిం చుకునేందు అదుపు తప్పి మాట్లాడుతున్నారు. నిన్నటి వేళ రోజా మళ్లీ తన నోటికి పని చెప్పారు. తనదైన శైలిలో చంద్రబాబును, ఆయన కొడుకును తిట్టిపోశారు. ఇలా తిట్టుకుంటూ పోతే వీటికి అడ్డూ అదుపూ లేకుండా పోతే ఈ రాష్ట్రం ఏమైపోతుందని? తమ అధినేత దగ్గర మార్కులు కొట్టేయాలన్న ఆలోచనతో కొందరు మరీ ఎక్కువగా చంద్రబాబును టార్గెట్ చేసుకుని పాత గొడవలన్నీ తవ్వి తీసి మాట్లాడడంతో తీవ్ర పరిణామాలు అన్నవి మున్ముందు చోటు చేసుకోక తప్పవు. ఇప్పటికే తాము ఎవ్వరినీ వదలమని లోకేశ్ చెబుతున్నారు. అన్నింటినీ గుర్తు పెట్టుకుంటామని రేపటి వేళ తాము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా అన్నింటికీ బదులు ఇస్తామని ప్రతికారేచ్ఛ అన్నది తప్పదని కూడా స్పష్టం చేస్తున్నారు వైసీపీ నాయకులు.