అయితే మృగేందర్ లాల్ పై ఓ యువతి లైంగిక వేధింపుల కేసును పెట్టారు. మృగేందర్ పెళ్లి చేసుకుంటానని తనను నమ్మించి మోసం చేశాడంటూ ఆమె కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు లో వివరాలను బట్టి చూస్తే అప్పుడు సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న సమయంలో మృగేందర్ తనకు ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యాడని ఆ తర్వాత తాము స్నేహితులం అయ్యామని.. తన తల్లి దండ్రులను ఒప్పించి బయటకు తీసుకు వెళ్లి మరీ తన పుట్టిన రోజు వేడుకలు చేశాడని ఆమె పేర్కొన్నారు.
ఆ తర్వాత తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా కూడా లోబరు చు కున్నాడంటూ ఆమె పేర్కొన్నారు. అతడి తండ్రి కూడా వైరా మాజీ ఎమ్మెల్యే అని చెప్పారు. ఆ తర్వాత అతడు తన తల్లి ని, తండ్రిని కూడా బెదిరించినట్టు ఆమె చెపుతున్నారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ను వివరణ కోరితే ఆ యువతి తమకు సమీప బంధువే అవుతుందని చెప్పినట్టు సమాచారం. అయితే ఈ కేసు గురించి తమకు తెలియదని కూడా ఆయన చెప్పినట్టు తెలుస్తోంది.