ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి ఆధ్వర్యంలో 300 కార్లతో పార్టీ కార్యాలయానికి పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకిలోని టీడీపీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి మంగళగరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. మంగళగిరి, హిందూపురం నుంచి భారీగా తరలి వచ్చిన నేతలు, కార్యకర్తలు. తమ ప్రసంగాలతో కార్యకర్తల్లో పరిటాల సునీత, రామ్మోహన్ నాయుడు, కూన రవి, నన్నూరి నర్శిరెడ్డి జోష్ నింపారు. టీడీపీ కార్యాలయం ముందున్న సర్వీస్ రోడ్ జనంతో కిక్కిరిసిపోయింది. పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో మూడు ఫ్లోర్లు కిటకిటలాడుతున్నాయి.
కూర్చొవడానికి చోటు దొరక్క నేతల తిప్పలు, జై తెలుగుదేశం నినాదాలతో టీడీపీ కార్యాలయ ప్రాంగణం మారిమోగిపోయింది. ఈ ఒక్క రోజే సుమారు 30-35 వేల మంది వచ్చారని టీడీపీ నేతలు చెబుతున్నారు. రెండు రోజుల్లో సుమారుగా 50 వేల మంది వస్తారని అంచనా వేసుకున్న టీడీపీ. మరోవైపు రాష్ట్రంలోరాష్ట్రంలో జరుగుతన్న పరిణామాలపై సీబీఐ చేత విచారణ జరిపించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, టీడీపీ నేతలు యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశ్, వర్ల రామయ్య, నిమ్మల రామానాయుడు తదితరులు కలిసి గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్కు కలిసి వినతి పత్రం అందజేశారు.