చైనా సరిహద్దులలో గత ఏడాది కేవలం లఢక్ పైనే పడింది, ఈసారి అరుణాచలప్రదేశ్ పై కూడా కన్నేసింది. దీనితో చైనాతో పూర్తిగా కట్ చేసుకోవడానికి భారత్ అడుగులు వేస్తుంది. తాజాగా జరిగిన లివరేజింగ్ చైనా ఎకానమీ సదస్సులో విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. చైనాపై ఈ తరహా చర్యలకు పూనుకుంటేనే భారత్ కు ప్రశాంతత ఉండబోదని, లేకపోతే కనిపించినవన్ని తమవే అంటూ చైనా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుందని ఆయన వ్యక్తం చేశారు. గతఏడాది జరిగినది మరిచిపోయి మళ్ళీ చైనాతో యధావిధిగా వాణిజ్యం చేయడం భారత్ సంయమనానికి గుర్తు తప్ప మరోలా అనుకుంటే అన్ని సంబంధాలు తెంచుకుని కూడా భారత్ స్వేచ్ఛగా వాణిజ్యం చేసుకోగలదు. అందుకే భారత్ లో ఆత్మనిర్బయ్ ప్రారంభం అయ్యింది.
ఈ విషయం తెగేదాకా లాకాకుండా ఉంటేనే అందరికి మంచిది, అసలే అన్ని సంక్షోభాలు ఒక్కసారిగా మీదపడ్డ చైనా దీనిని ఏవిధంగా తీసుకుంటుందో చూడాల్సి ఉంది. భారత్ మాత్రం ఆత్మనిర్బయ్ ని సంకల్పంగానే భావిస్తుంది. కేవలం దేశీయంగా ఉత్పత్తి చేసి, వాడకం మాత్రమే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి ఈ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రధాని సమాలోచనలు చేస్తున్నారు. దానికోసం ఇప్పటికే యువతను ఉత్సాహపరిచే విధంగా వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు. చాలా త్వరగానే ఆత్మనిర్బయ్ ద్వారా దేశం తన కాళ్లపై తాను నిలబడుతుంది. ఎన్నో దేశాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది అని హర్షవర్ధన్ అన్నారు.